నేడు జీఎస్టీ కౌన్సిల్‌ కీలక భేటీ..శ్లాబ్‌ల్లో భారీ మార్పులు!

నేడు జీఎస్టీ కౌన్సిల్‌ కీలక భేటీ..శ్లాబ్‌ల్లో భారీ మార్పులు!

కేంద్ర ప్రభుత్వం పేద‌, మ‌ధ్య త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల‌కు శుభవార్త చెప్పేందుకు సిద్ధమవుతోంది. నేడు ఉద‌యం 11 గంట‌ల‌కు జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశమవుతోంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశం పన్ను వ్యవస్థలో కీలక మార్పులకు వేదిక కానుంది. ముఖ్యంగా జీఎస్టీ శ్లాబ్‌లలో భారీ మార్పులు చేయనున్నట్లు అంచనా. ప్రస్తుతం అమల్లో ఉన్న 12 శాతం, 28 శాతం శ్లాబ్‌లను రద్దు చేసి, ఆ కేటగిరీల్లోని ఉత్పత్తులను 5 శాతం, 18 శాతం శ్లాబ్‌ల్లోకి మార్చే ప్రతిపాదన కౌన్సిల్‌ ముందుకు రానుంది.

లగ్జరీ ఉత్పత్తులు, పొగాకు వంటి వాటిపై 40 శాతం జీఎస్టీ కొనసాగించాలని ఇప్పటికే పలు రాష్ట్రాల మంత్రులతో కూడిన జీఎస్టీ ఉపసంఘం సిఫారసు చేసింది. ఈ నిర్ణయాలకు ఆమోదం లభిస్తే, ముఖ్యంగా ఆటోమొబైల్‌ రంగంలో గణనీయమైన మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఈ భేటీకి తెలుగు రాష్ట్రాల ఆర్థిక మంత్రులు పయ్యావుల కేశవ్, భట్టి విక్రమార్క హాజరుకానున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment