గాజాకు (Gaza) మానవతా సాయం అందించేందుకు వెళ్లిన పర్యావరణ కార్యకర్త గ్రెటా థన్బర్గ్ (Greta Thunberg)ను ఇజ్రాయెల్ (Israel) దళాలు అడ్డుకోవడం, ఆ తర్వాత ఆమెను “కిడ్నాప్ చేశారంటూ” సోషల్ మీడియాలో ఆరోపణలు చేయడంపై అమెరికా (America) మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) స్పందించారు.
“ఆమె ఒక వింత మనిషి” అని ట్రంప్ వ్యాఖ్యానించారు. “ఆమె కోపం నిజమైందో కాదో తెలియదు గానీ, ఆమెకు కోపం తగ్గాలంటే ప్రత్యేకమైన తరగతులకు పంపించాలి. కోపానికి సంబంధించిన కోచింగ్ సెంటర్ ఉంటే దానికి పంపించాలని” సూచించారు. “ఇప్పటికే ఇజ్రాయెల్ సైన్యానికి (Israel Army) అనేక సమస్యలు ఉన్నాయని, కొత్తగా ఈ తలనొప్పి ఎందుకు” అని ట్రంప్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. గతంలో ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కూడా గ్రెటాను (Greta) “యూదు ద్రోహి” అని పేర్కొన్నారు.
గాజాకు గ్రెటా ప్రయాణం, అదుపులోకి తీసుకోవడం
పాలస్తీనాకు (Palestine) అనుకూలంగా గ్రెటా థన్బర్గ్ (Greta Thunberg) ‘ఫ్రీడమ్ ఫ్లొటిల్లా అలయన్స్’ (Freedom Flotilla Alliance) అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించారు. యూరోపియన్ పార్లమెంట్ సభ్యురాలు (European Parliament Member) రీమా హసన్ (Rima Hassan)తో కలిసి మొత్తం 12 మందితో కూడిన ఈ బృందం ‘మడ్లీన్'(Marlin) నౌకలో వివిధ రకాల ఆహార వస్తువులతో గాజాకు బయల్దేరారు. అయితే, సోమవారం తెల్లవారుజామున ఇజ్రాయెల్ ఆర్మీ అంతర్జాతీయ జలాల్లో ఈ నౌకను అడ్డుకుని అదుపులోకి తీసుకుంది. దీంతో తమను IDF (ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్) కిడ్నాప్ చేసిందని థన్బర్గ్ ఆరోపించారు.
గాజాలో మానవతా సంక్షోభం
2023 అక్టోబర్ 7న హమాస్ ఇజ్రాయెల్పై దాడి చేసి బందీలను తీసుకెళ్లినప్పటి నుంచి, హమాస్ను అంతం చేయడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ గాజాపై దాడులు చేస్తోంది. దీంతో గాజా తీవ్రంగా ధ్వంసమైంది. చాలా నెలలుగా గాజా సరిహద్దులు మూసివేయడంతో ఆహార పదార్థాలు లభించక అక్కడి ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. అంతర్జాతీయంగా ఒత్తిడి రావడంతో, రెండు వారాలుగా గాజా సరిహద్దులను ఇజ్రాయెల్ తెరిచింది. దీంతో స్వచ్ఛంద సంస్థలు ఆహారం పంపిణీ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే థన్బర్గ్ బృందం బయల్దేరింది. అయితే, ఆమె పాలస్తీనా అనుకూలంగా ఉండటంతో ఇజ్రాయెల్ ఆమెను అడ్డుకుంది.