గోదావరిలో విషాదం.. ముగ్గురి మృతదేహాలు వెలికితీత

గోదావరిలో విషాదం.. ముగ్గురి మృతదేహాలు వెలికితీత

గోదావరి నదిలో విషాదకర ఘటన జరిగింది. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రం ముమ్మడివరం (Mummidivaram) సమీపంలో 8 మంది యువకులు గల్లంతు అయిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. సోమవారం సాయంత్రం ఈ సంఘటన చోటుచేసుకోగా, సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు మరియు ఎన్డీఆర్ఎఫ్ (NDRF) బృందాలు గాలింపు చర్యలు ప్రారంభించాయి.

మంగళవారం తెల్లవారుజామున ముగ్గురు మృతదేహాలు లభ్యం అయ్యాయి. మంగళవారం తెల్లవారుజామున ముగ్గురు యువకుల మృతదేహాలు గోదావరి నదిలో నుంచి వెలికితీశారు. అయితే మిగిలిన ఐదుగురు కోసం ఇంకా గాలింపు కొనసాగుతోంది. గల్లంతైన వారిలో క్రాంతి, పాల్, సాయి, మహేష్, సతీష్, రాజేష్, రోహిత్ ఉన్నారు.

స్నేహితుడి పెళ్లి కోసం వచ్చి
ఈ యువకులు కాకినాడ (Kakinada), రామచంద్రపురం (Ramachandrapuram), మండపేట (Mandapeta) ప్రాంతాలకు చెందినవారు. ఒక స్నేహితుడి వివాహానికి హాజరయ్యేందుకు వచ్చిన వారు అనంతరం గోదావరిలో ఈతకొట్టడానికి నీటిలోకి దిగారు. మొత్తం 11 మంది నీటిలోకి దిగగా, వారిలో 8 మంది మునిగిపోయారు. మిగతా ముగ్గురు తృటిలో ప్రాణాలు దక్కించుకున్నారు.

కుటుంబాల్లో తీరని విషాదం
ఈ విషాద ఘటనతో గల్లంతైన యువకుల ఇళ్లల్లో కన్నీరే మిగిలింది. కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. అధికారులు మిగిలిన ఐదుగురి కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. ఈ ఘటనపై అధికారులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు మరలా జరగకుండా, ప్రజలు నదుల్లో ఈత కొట్టే సమయంలో పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment