జీహెచ్ఎంసీ అడ్మిన్ విభాగంలో జాయింట్ కమిషనర్గా పనిచేస్తున్న జనకిరామ్ వివాదంలో చిక్కుకున్నారు. తనకంటే 20 ఏళ్లు చిన్నవయస్సున్న యువతితో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఆయనను భార్య కళ్యాణి రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది.
ఇటీవల భర్త ఇంటికి ఆలస్యంగా రావడం గమనించిన కళ్యాణి, అతనిపై నిఘా పెట్టింది. అతని కదలికపై రెక్కీ చేపట్టింది. చివరికి సికింద్రాబాద్ వారాసిగూడలో యువతితో ఓ అపార్ట్మెంట్లో ఉండగా అతన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది. అక్కడే జరిగిన ఘర్షణలో కళ్యాణి భర్తను, అతని ప్రియురాలిని చితకబాదింది.
కళ్యాణి ఆరోపణల ప్రకారం, జనకిరామ్ పని చేసే ప్రతి చోటా మహిళలతో వివాహేతర సంబంధాలు పెట్టుకునేవాడట. ఘర్షణపై సమాచారం అందుకున్న వారాసిగూడ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ఇద్దరినీ స్టేషన్కు తరలించారు.