గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి తీరు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇస్కాన్ ఆధ్వర్యంలో రోడ్లపై భగవద్గీత పుస్తకాల విక్రయాలను చేపట్టిన సభ్యులపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేయడం వివాదానికి కారణమైంది. రోడ్లపై పుస్తకాలు ఎలా అమ్ముతారని ఇస్కాన్ సభ్యులతో టీడీపీ ఎమ్మెల్యే వాగ్వాదానికి దిగింది.
ఎమ్మెల్యే ప్రశ్నలకు ఇస్కాన్ చాలా కూల్గా సమాధానం ఇచ్చారు. తాము భారతదేశంలోనే ఉన్నామని, బంగ్లాదేశ్లో లేమని బదులిచ్చారు. ఈ ఘటన వెంటనే స్థానికంగా హాట్ టాపిక్ అయింది. ఒకవైపు ప్రజలు గల్లా మాధవిపై విమర్శలు చేస్తుండగా, మరొకవైపు ఆమెకు మద్దతు తెలిపే వారు కూడా కనిపిస్తున్నారు.