ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకోనుంది. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అందించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఆర్టీసీ అధికారులు ఇప్పటికే తమ నివేదికను సమర్పించగా, సంక్రాంతి పండుగకు ఈ పథకాన్ని ప్రారంభించాలని ప్రభుత్వం ప్రణాళికలు చేస్తోంది.
మహిళల ప్రయాణానికి మేలుకొలుపు
ఈ పథకం అమలుతో మహిళల కోసం ఉచిత ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి రానుంది. ఇది వారికే ప్రత్యేకంగా డిజైన్ చేసిన పథకమని ప్రభుత్వం భావిస్తోంది. సంక్రాంతి వేళ ఈ పథకం ప్రారంభం అయితే మహిళలు ఉచితంగా బస్సుల్లో ప్రయాణం చేయనున్నారు. ఈ పథకం అమలులో ప్రభుత్వం ఎలాంటి నిబంధనలు విధిస్తుందో వేచిచూడాలి.
తెలంగాణ మాదిరిగా పల్లెవెలుగు, ఎక్స్ప్రెస్లలో మాత్రమే ఉచిత ప్రయాణానికి అనుమతిస్తారా, లేక లగ్జరీ బస్సుల్లోనూ ప్రయాణం చేసే వెసులుబాటు కల్పిస్తారా అనేది అందరిలో మెదిలే సందేహం.








