ఇండియా-పాకిస్తాన్ మధ్య టెస్ట్ క్రికెట్ సిరీస్ నిర్వహించాలని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ సూచించారు. ప్రస్తుతం బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ (BGT) టెస్టు మ్యాచ్లకు భారీగా ప్రేక్షకుల మద్దతు ఉందని, అదే విధంగా IND vs PAK టెస్టులకు మరింత ప్రజాదరణ ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.
“ఇండియా-పాకిస్తాన్ టెస్టు మ్యాచ్లు వన్డే, టీ20లకు మించిన రెట్టింపు ఆసక్తిని అందిస్తాయి. భారత్-పాక్ జట్లు ప్రపంచకప్ లేదా ఛాంపియన్స్ ట్రోఫీల్లో మాత్రమే తలబడతాయి. కానీ, టెస్ట్ క్రికెట్లో ఈ రెండు జట్ల మధ్య పోటీ నిఖార్సైన క్రికెట్ను చూపిస్తుంది. ప్రత్యేకంగా UK లేదా ఆస్ట్రేలియాలో ఈ మ్యాచ్లు నిర్వహిస్తే, ఇది ప్రపంచ క్రికెట్ అభిమానులకు పండగ అవుతుంది” అని మైఖేల్ వాన్ అన్నారు.
2007లో చివరిసారి జరిగిన ఇండియా-పాకిస్తాన్ టెస్టు సిరీస్ను ఇండియా 1-0తో గెలుచుకుంది. ప్రస్తుతం ఈ రెండు జట్ల మధ్య టెస్టు సిరీస్ కోసం ప్రపంచం మొత్తం ఎదురుచూస్తోంది.