జైలు నుంచి కొడుకు చితివ‌ద్ద‌కు.. ఏ తండ్రికీ వ‌ద్దు ఈ క‌ష్టం

జైలు నుంచి కొడుకు చితివ‌ద్ద‌కు.. ఏ తండ్రికీ వ‌ద్దు ఈ క‌ష్టం

క‌న్న కొడుకు చ‌నిపోయి విగ‌త‌జీవిగా ప‌డి ఉండ‌గా, చేయ‌ని నేరానికి తండ్రి జైల్లో ఉన్నాడు. కొడుకు మృతివార్త విని జైలు గోడ‌ల మ‌ధ్య ఆ తండ్రి న‌ర‌కం అనుభ‌వించాడు. క‌ట‌క‌టాల్లో ఉన్న తండ్రి.. త‌న క‌ళ్ల‌లో కొడుకు రూపాన్ని గుర్తుతెచ్చుకొని హృద‌యం ప‌గిలే రోదించాడు. శ్రీ‌స‌త్య‌సాయిజిల్లా (Sri Sathya Sai District) హిందూపురంలో (Hindupur) చోటుచేసుకున్న ఈ హృద‌య‌విదార‌క ఘ‌ట‌న స్థానికుల‌ను సైతం కంట‌త‌డి పెట్టించింది.

శ్రీ‌స‌త్య‌సాయి జిల్లా వైసీపీ (YSRCP) బూత్ కన్వీనర్ (Booth Convenor) వాల్మీకి లోకేష్ (Walmiiki Lokesh) కుమారుడు (Son) అశ్విన్ ఆరాధ్య (Ashwin Aaraadhya) శుక్ర‌వారం సాయంత్రం ప్రమాదవశాత్తు విద్యుత్ తీగ‌లు (Electric Wires) త‌గిలి మృతిచెందాడు (Died). ఓ కేసులో స‌బ్‌జైల్‌లో తండ్రి లోకేశ్ శిక్ష అనుభ‌విస్తున్నారు. కుమారుడి మృతివార్త తెలిసిన వెంట‌నే వాల్మీకి లోకేష్ త‌ర‌ఫు న్యాయ‌వాది (Lawyer) కోర్టులో పిటిష‌న్ (Court Petition) వేశారు. కోర్టు అనుమ‌తితో పెరోల్‌ (Parole) పై త‌న కొడుకు అంత్య‌క్రియ‌ల‌కు (Funeral) వ‌చ్చాడు. చ‌ల‌నం లేకుండా ప‌డి ఉన్న త‌న కొడుకు అశ్విన్ ఆరాధ్య‌ను చూసి క‌న్నీటి ప‌ర్యంత‌మ‌య్యారు.

హిందూపురం పట్టణానికి చెందిన వాల్మీకి లోకేష్‌పై కూట‌మి నేత‌లు కేసు బ‌నాయించి జైల్‌కు పంపించారు. చేయ‌ని నేరానికి శిక్ష అనుభ‌విస్తున్న లోకేష్‌కు.. త‌న కుమారుడు అశ్విన్ ఆరాధ్య విద్యుదాఘాతానికి గురికావ‌డంతో కుంగిపోయాడు. ఆ బాధ‌ను దిగ‌మింగుకోలేక జైలు గోడ‌ల‌కు త‌ల‌ను బాదుకోవ‌డంతో తీవ్ర‌గాయ‌మై, శ్వాస తీసుకునేందుకు ఇబ్బంది ప‌డ్డారు. దీంతో హుటాహుటిన లోకేశ్‌ను ఆసుప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందించారు. అనంత‌రం కుమారున్ని క‌డ చూపు చూసుకునేందుకు పెరోల్‌పై విడుద‌లై జైలు నుంచి చితివ‌ద్ద‌కు చేరుకొని క‌న్నీటి నివాళుల‌ర్పించారు. ఇంత‌టి క‌ష్టం ఏ తండ్రికీ రాకూడ‌ద‌ని స్థానికులు క‌న్నీరు పెట్టుకున్నారు. కొడుకు క‌డ‌చూపును చూసుకునేందుకు కోర్టు అనుమ‌తి పొందాల్సిన‌ ప‌రిస్థితి క‌ల్పించిన వారిపై మండిప‌డుతున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment