క‌లెక్ట‌ర్ ఎదుట‌నే రైతు ఆత్మ‌హ‌త్యాయ‌త్నం..

క‌లెక్ట‌ర్ ఎదుట‌నే రైతు ఆత్మ‌హ‌త్యాయ‌త్నం..

అన‌కాప‌ల్లి జిల్లా క‌లెక్ట‌రేట్ వ‌ద్ద తీవ్ర గంద‌ర‌గోళ ప‌రిస్థితి నెల‌కొంది. జిల్లా క‌లెక్ట‌ర్ ఎదుటే రైతు పురుగుల మందు తాగి ఆత్మ‌హ‌త్య‌కు య‌త్నించిన ఘ‌ట‌న తీవ్ర క‌ల‌కలం సృష్టించింది. స్థానికుల వివ‌రాల ప్ర‌కారం.. మాక‌వ‌ర‌పాలెం మండ‌లం తూటిపాల గ్రామానికి చెందిన రైతు అనిమిరెడ్డి ర‌మ‌ణ త‌న ఆవేద‌న‌ను చెప్పుకునేందుకు క‌లెక్ట‌రేట్‌కు వచ్చారు. ఇటీవ‌ల‌ షార్ట్ సర్క్యూట్ కారణంగా మ‌ర‌ణ ఇల్లు అగ్నికి ఆహుతి అయ్యింది. త‌న‌కు న్యాయం చేయాల‌ని, త‌న ఇల్లు మొత్తం కాలిపోయింద‌ని ర‌మ‌ణ‌⁠ అధికారులు చుట్టూ తిరుగుతున్నా.. పట్టించుకోక పోవడంతో క‌లెక్ట‌ర్ ఎదుట‌నే ఆ రైతు పురుగుల మందు సేవించి ఆత్మహత్య‌కు య‌త్నించాడు. దీంతో అక్క‌డున్న సిబ్బంది రమణను ఆటోలో హుటాహుటిన స్థానిక ఆస్ప‌త్రికి తరలించారు. ప్ర‌స్తుతం ర‌మ‌ణ‌కు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ ఘ‌ట‌న‌పై పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Join WhatsApp

Join Now

Leave a Comment