హైదరాబాద్లో నకిలీ కాల్ సెంటర్ వ్యవహారం కలకలం రేపుతోంది. గుజరాత్కు చెందిన మనస్విని అనే మహిళ హైటెక్ సిటీలో ‘ఎక్సిటో సొల్యూషన్స్’ పేరుతో నకిలీ కాల్ సెంటర్ను ఏర్పాటు చేసింది. వాన్పటేల్, ప్రతీక్, రాహుల్ అనే ముగ్గురు వ్యక్తులతో కలిసి ఈ కాల్ సెంటర్ను ఆమె నిర్వహిస్తోంది. ఈ ముఠా అమెరికా పౌరులను లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు.
60 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు
పక్కా సమాచారంలో ఎక్సిటో సొల్యూషన్స్పై దాడి చేసిన సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు ఏకంగా మనస్విని సహా 60 మందిని అరెస్టు చేశారు. ఈ నకిలీ కాల్ సెంటర్లో ఈశాన్య రాష్ట్రాలకు చెందిన వ్యక్తులను టెలీ కాలర్లుగా నియమించారని తెలిపారు. 63 లాప్ టాప్లు, పదు సంఖ్యల్లో సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లుగా సమాచారం. ఈ కేసులో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశమున్నట్లుగా తెలుస్తోంది.