ఫార్ములా-ఈ రేసింగ్ నిధుల దుర్వినియోగానికి సంబంధించి తెలంగాణ మంత్రి కేటీఆర్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీ చేసింది. జనవరి 7న విచారణకు హాజరుకావాలని కేటీఆర్ను నోటీసులో ఆదేశించింది.
అంతేకాకుండా, ఈ కేసులో సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డిలను జనవరి 2 మరియు 3 తేదీల్లో విచారణకు హాజరు కావాలని ఈడీ కోరింది. ఫార్ములా-ఈ నిధుల దుర్వినియోగానికి సంబంధించి కేటీఆర్పై ఆరోపణలు నమోదైన నేపథ్యంలో ఈ విచారణ చేపట్టడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఫార్ములా ఈ–కారు రేసు కేసులో నిన్న విచారణ చేపట్టిన హైకోర్టు డిసెంబర్ 31 వరకు కేటీఆర్ను అరెస్ట్ చేయవద్దని ఆదేశాలిచ్చింది. ఈ కేసులో ఏసీబీ కోర్టులో కౌంటర్ దాఖలు చేసింది. హైకోర్టు ఇచ్చిన అరెస్ట్ ఆదేశాలను ఎత్తివేయాలని కోరుతూ, ఏసీబీ మరో పిటిషన్ దాఖలు చేసింది. కేటీఆర్ను విచారించాల్సిన అవసరం ఉందని, ఈ దశలో ఆయనకు మధ్యంతర బెయిల్ కొనసాగితే విచారణకు ఆటంకం కలుగుతుందని ఏసీబీ వాదించింది. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు ఈనెల 31కి విచారణను వాయిదా వేసింది.