ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఖాళీ అయిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఏపీలో ఐదు, తెలంగాణలో ఐదు ఖాళీలకు ఈసీ షెడ్యూల్ను ప్రకటించింది. మార్చి 3న ఈ ఖాళీలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల విడుదల చేయనున్నారు. మార్చి 10 నుంచి నామినేషన్ల స్వీకరణ, 11న పరిశీలన, మార్చి 13 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇచ్చారు. మార్చి 20న పోలింగ్ జరగనుండగా, అదే రోజు కౌంటింగ్ ప్రక్రియ చేపట్టి రిజల్ట్ ప్రకటించనున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జంగా కృష్ణమూర్తి, యనమల రామకృష్ణుడు, పరుచూరి అశోక్బాబు, తిరుమల నాయుడు, రామారావు రిటైర్ కానున్నారు. అదే విధంగా తెలంగాణ మహమూద్ అలీ, సత్యవతి, శేరి సుభాష్రెడ్డి, మల్లేశం, రియాజుల్ హుస్సేన్ ఎమ్మెల్సీ పదవి నుంచి రిటైర్ కానున్నారు. ఈనెల 28తో వీరి ఎమ్మెల్సీ పదవీకాలం ముగియనుంది.