ఇచ్ఛాపురంలో భూకంపం.. భ‌యాందోళ‌న‌లో ప్ర‌జ‌లు

ఇచ్ఛాపురంలో భూకంపం.. భ‌యాందోళ‌న‌లో ప్ర‌జ‌లు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో ఇటీవ‌ల చోటుచేసుకుంటున్న భూప్ర‌కంప‌న‌లు ప్ర‌జ‌ల‌ను భ‌యాందోళ‌న‌కు గురిచేస్తున్నాయి. ప్ర‌కాశం జిల్లాలో ఇటీవ‌ల మూడుసార్లు కంపించింది. తాజాగా శ్రీ‌కాకుళం జిల్లా ఇచ్ఛాపురం ప్రాంతం రెండుసార్లు స్వల్ప భూప్ర‌కంప‌న‌లు చోటుచేసుకున్నాయి. స్థానికుల వివరాల ప్రకారం, బుధవారం రాత్రి 10:56 గంటలకు రెండు సెకన్ల పాటు భూమి కంపించింది. ఈ ఘటనతో భయంతో వెలుపలికి పరుగులు తీసిన ప్రజలు, గురువారం తెల్లవారుజామున 4:55 గంటల సమయంలో మరోసారి భూమి స్వల్పంగా కంపించింద‌ని తెలిపారు. ఈ పరిణామాలు స్థానికులలో ఆందోళన రేకెత్తించాయి. 2019 అక్టోబర్‌లో ఇలాంటి భూ ప్రకంపనలు నమోదైనట్లు గుర్తుచేసుకుంటున్నారు. ఈ ఘ‌ట‌న‌లో ఎలాంటి ఆస్తి, ప్రాణ‌న‌ష్టం జ‌ర‌గ‌లేద‌ని తెలుస్తోంది.

Join WhatsApp

Join Now

Leave a Comment