భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ మరియు సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ ధనశ్రీ వర్మ తమ వైవాహిక బంధాన్ని ముగింపు పలికారు. ముంబై ఫ్యామిలీ కోర్టు వీరి జంటకు విడాకులు మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఈ పరిణామాల నడుమ, ధనశ్రీ తాజాగా గృహహింసపై స్పందిస్తూ ఓ ప్రత్యేకమైన పాటను విడుదల చేశారు.
బాధితురాలి పాత్రలో..
‘దేఖా జీ దేఖా మైనే’ అనే టైటిల్తో విడుదలైన ఈ ప్రైవేట్ ఆల్బమ్లో, ధనశ్రీ గృహహింసకు గురైన బాధితురాలి పాత్రలో కనిపించారు. భర్త చేతిలో మోసపోయిన ఓ మహిళగా, ఆ బాధను ప్రతిబింబించేలా ఆమె ప్రదర్శన ఉంది. ఈ పాట యూట్యూబ్లో వైరల్ అవుతూ, నెటిజన్లను ఆకర్షిస్తోంది. పాట ద్వారా ధనశ్రీ వ్యక్తిగత అనుభవాలను పరోక్షంగా చెప్పే ప్రయత్నం చేశారా? అనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి.