ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల వేడి ఇంకా చల్లారలేదు. పోలింగ్ పూర్తయినప్పటికీ రాజకీయ విమర్శల వేడి ఇంకా కొనసాగుతూనే ఉంది. మాజీ సీఎం, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ నివాసానికి ఏసీబీ బృందం వచ్చింది. బీజేపీ ఫిర్యాదు నేపథ్యంలో, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ACBకి దర్యాప్తు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. ఇది త్వరితగతిన పూర్తవ్వాలని సూచించారు. దీంతో ACB అధికారులు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నివాసానికి చేరుకున్నారు. ఈ పరిణామం ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) నేతల ఆందోళనకు దారితీసింది.
ఏం జరిగిందంటే..
అరవింద్ కేజ్రీవాల్ బీజేపీపై తీవ్ర ఆరోపణలు చేశారు. 16 మంది AAP ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికి రూ.15 కోట్లు ఆఫర్ చేసి తమ పార్టీలో చేర్చుకునే ప్రయత్నం చేశారని వెల్లడించారు. అయితే, ఈ ఆరోపణలను ఖండించిన బీజేపీ, ACBకి అధికారికంగా ఫిర్యాదు చేసింది. ఈ పరిణామాలు ఢిల్లీ రాజకీయాలను మరింత తీవ్రతరం చేస్తుండటంతో, భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో వేచి చూడాలి.