ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు నుంచి భారతీయ జనతా పార్టీ తన ఆధిపత్యం కొనసాగిస్తోంది. ఉదయం 9.30 గంటలకు బీజేపీ 48 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. అధికార ఆమ్ ఆద్మీ పార్టీ 21 సీట్లతో వెనుకంజలో ఉంది. కాంగ్రెస్ పార్టీ ఒక్క స్థానంలో మాత్రమే ఆధిక్యంలో ఉంది.
న్యూఢిల్లీ స్థానంలో ఆప్ కన్వీనర్, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ బీజేపీ అభ్యర్థి పర్వేష్ వర్మ కంటే వెనకున్నారు. జంగ్పురాలో సిసోడియా, కల్కాజీలో ఢిల్లీ సీఎం అతిషి, షీలా దీక్షిత్ కుమారుడు సందీప్ వెనుకంజలో ఉన్నారు. మ్యాజిక్ ఫిగర్ 36 దాటిన బీజేపీ.. తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. ఈసారి ఎలాగైనా ఢిల్లీలో అధికారం చేపట్టాలన్న ఉవ్విళ్లూరుతున్న బీజేపీ కల ఈ ఎన్నికల కౌంటింగ్ ద్వారా నిజం కానున్నట్లుగా తెలుస్తోంది.