ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) 18వ సీజన్ కోసం సిద్ధమవుతోంది. మరికొన్ని రోజుల్లో ఐపీఎల్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఫ్రాంచైజీ టీమ్స్లలో కొత్తకొత్త మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్ కొత్త కెప్టెన్గా అక్షర్ పటేల్ నియమితుడయ్యాడు. ఫ్రాంచైజీ అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించింది.
2019 నుంచి ఢిల్లీ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న పటేల్, ఇప్పటి వరకు 150 IPL మ్యాచ్లు ఆడి 1,653 పరుగులు చేయడంతో పాటు 123 వికెట్లు సాధించారు. బౌలింగ్, బ్యాటింగ్లో సమతూకం కలిగిన ఈ ఆల్రౌండర్కు సారథ్య బాధ్యతలు అప్పగించడంపై అభిమానులు సానుకూలంగా స్పందిస్తున్నారు.
కేఎల్ రాహుల్ కెప్టెన్సీ బాధ్యతలు తీసుకోవడాన్ని నిరాకరించడంతోనే ఫ్రాంచైజీ అక్షర్ పటేల్ను కెప్టెన్గా ఎంపిక చేసినట్లు సమాచారం. 2025 సీజన్లో అతని నాయకత్వంలో ఢిల్లీ ఎలా రాణిస్తుందో చూడాలి.