దేశంలో కోవిడ్ మహమ్మారి (COVID Pandemic) ఉగ్రరూపం దాల్చుతోంది. రోజు రోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య (Positive Case Count) పెరుగుతోంది. మూడు వారాల క్రితం డబుల్ డిజిట్కే పరిమితమైన కరోనా కేసులు.. ప్రస్తుతం వేలల్లో నమోదవుతున్నాయి. కరోనా (Corona) పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ఆరోగ్య శాఖ (Central Health Department) సూచిస్తోంది. గత 24 గంటల్లో 276 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. అదేవిధంగా ఏడుగురు (Seven People) కరోనా బాధితులు (Corona Patients) మృతి (Death) చెందారు. దీంతో దేశవ్యాప్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య 4,302కి చేరుకుంది.
కొత్త వేరియంట్ల ప్రభావం
తాజా కేసుల వెనుక కొత్త వేరియంట్ల (New Variants) ప్రభావం ఉండొచ్చని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇటీవల నివేదికల ప్రకారం.. ఒమిక్రాన్ (Omicron) ఉప-వేరియంట్లు (LF.7, XFG, JN, NB01.8.1) దేశంలో వ్యాప్తి చెందుతున్నాయి. అయితే, ఈ వేరియంట్లు తీవ్రమైన ప్రమాదాన్ని కలిగించే అవకాశం తక్కువని, ప్రజల్లో ఉన్న రోగనిరోధక శక్తి వల్ల ఆందోళన అవసరం లేదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
కరోనా లక్షణాలు.. జాగ్రత్తలు
ప్రస్తుతం కరోనా లక్షణాలు సాధారణంగా జలుబు, గొంతు నొప్పి, తక్కువ జ్వరం, అలసట, తలనొప్పి వంటి ఫ్లూ లాంటి లక్షణాలుగా కనిపిస్తున్నాయి. ఈ లక్షణాలు 5 రోజులకు మించి కొనసాగితే, వెంటనే వైద్యుడిని సంప్రదించి కరోనా పరీక్ష చేయించుకోవాలని ఆరోగ్య శాఖ సూచిస్తోంది. ప్రజలు క్రమం తప్పకుండా చేతులు కడుక్కోవడం, మాస్కులు ధరించడం, రోగనిరోధక శక్తిని పెంచే ఆహారం తీసుకోవడం వంటి చర్యలు తీసుకోవాలని కేంద్ర ఆరోగ్య శాఖ సిఫారసు చేసింది. అలాగే, ఆస్పత్రుల్లో కరోనా టెస్ట్ కిట్లు, వ్యాక్సిన్లు, ఆక్సిజన్ సిలిండర్లు, హాస్పిటల్ బెడ్స్ అందుబాటులో ఉంచాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది.
రాష్ట్రాల్లో పాజిటివ్ కేసులు..
కేరళ (Kerala)లో అత్యధికంగా 1,416 యాక్టివ్ కేసులు (Active Cases) నమోదయ్యాయి, ఢిల్లీ (Delhi)లో 393, మహారాష్ట్ర (Maharashtra)లో 467 కేసులు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో 28, తెలంగాణ (Telangana)లో 4 యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. విశాఖపట్నం (Visakhapatnam)లో ఒమిక్రాన్ వేరియంట్ కేసు బయటపడగా, కర్నూలు (Kurnool)లో ముగ్గురికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఏలూరు కలెక్టరేట్లో నలుగురు అధికారులకు కరోనా సోకినట్లు తెలిసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు కరోనా కేసుల పెరుగుదల నేపథ్యంలో అప్రమత్తమయ్యాయి. విశాఖపట్నం, శ్రీకాకుళం, కర్నూలు వంటి జిల్లాల్లో కేసులు నమోదవుతున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కరోనా పరీక్షలు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. కోవిడ్ నిర్ధారణ పరీక్షలను పెంచాలని ఆరోగ్య శాఖ అధికారులు సూచించారు.