అసెంబ్లీ సమావేశాల ప్రారంభం నుంచి తెలంగాణ రాజకీయాలు ఉత్కంఠభరితంగా కొనసాగుతున్నాయి. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య సవాళ్ల పరంపర కొనసాగుతుండగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాజీ మంత్రి హరీష్ రావు విసిరిన సవాల్పై తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన ప్రాజెక్టులపై చర్చించడానికి పిల్ల కాకులు అయిన హరీష్ రావు, కేటీఆర్ కాదని, అసలు నేత కేసీఆర్ రావాలని సవాల్ విసిరారు.
ఈ వ్యాఖ్యలపై హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఘాటుగా స్పందించారు. “రేవంత్ రెడ్డి స్థాయికి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఎందుకు? నేనే ఉన్నాను కదా.. రేవంత్ నీది కేవలం నా స్థాయి మాత్రమే” అంటూ సోమవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద సంచలన వ్యాఖ్యలు చేశారు.