తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హుటాహుటిన ఢిల్లీకి బయలుదేరారు. ఇవాళ మధ్యాహ్నం శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి హస్తినకు పయనమైన ఈ ముగ్గురు నేతలు, సాయంత్రం 6 గంటలకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో భేటీ కానున్నట్లు సమాచారం.
ఈ ఆకస్మిక ఢిల్లీ టూర్ వెనుక ముఖ్యమైన కారణం మంత్రివర్గ విస్తరణపై చర్చ అని తెలంగాణ కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ఇప్పటికే ఈ అంశంపై అధిష్టానం పలు దఫాలుగా చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఇక ఈరోజు తుదినిర్ణయం వెలువడే అవకాశముందని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఉగాదికి ముందే తెలంగాణలో కేబినెట్ విస్తరణ ఉంటుందన్న చర్చ జోరందుకుంది.