చైనా అధ్యక్షుడు జిన్పింగ్ దేశవ్యాప్తంగా కొత్తగా 200 జైళ్లను నిర్మించాలని ప్రకటించడం సంచలనంగా మారింది. ఈ జైళ్ల నిర్మాణం ప్రభుత్వ విధేయతలో లేని వ్యక్తులు, అవినీతికి పాల్పడుతున్నారనే ఆరోపణలపై చర్యలు తీసుకునేందుకు అన్నమాటపై వివాదం రేగుతోంది.
వ్యాపారవేత్తల నుంచి నిపుణుల వరకు..
సీఎన్ఎన్ వెల్లడించిన కథనం ప్రకారం.. జిన్పింగ్ దృష్టి సారించిన వారి జాబితాలో వ్యాపారవేత్తలు, స్కూళ్లు-ఆస్పత్రుల యజమానులు, వివిధ రంగాల నిపుణులు కూడా ఉన్నారు. అవినీతి పేరిట వారిపై చర్యలు తీసుకుంటున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఈ జైళ్లు కమ్యూనిస్టు పార్టీకి, ప్రభుత్వానికి విశ్వాసం చూపనివారి కోసం కట్టిస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.
జైళ్ల నిర్మాణం వెనుక ఉన్న అసలు ఉద్దేశం దేశంలో అధికార పటిష్టతకు సంబంధించిందా లేక ప్రజలపై నియంత్రణ పెంచడానికా అన్నది చర్చనీయాంశమవుతోంది.