మంగళగిరి వేదికగా జరుగుతున్న తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) వార్షిక పండుగ ‘మహానాడు'(Mahanadu)లో మరోసారి పాత తీర్మానమే పునరావృతమైంది. టీడీపీ(TDP) వ్యవస్థాపకుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు (Nandamuri Taraka Rama Rao-NTR) (ఎన్టీఆర్)కు దేశ అత్యున్నత పురస్కారం ‘భారతరత్న'(Bharat Ratna) ఇవ్వాలంటూ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) మరోమారు తీర్మానం ప్రవేశపెట్టారు. అయితే, ఈ తీర్మానం వెనుక ఉన్న రాజకీయ చిత్తశుద్ధిని ప్రశ్నిస్తూ ప్రస్తుతం సోషల్ మీడియాలో, రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.
ఆరు సార్లకు పైగా అదే రాగం
మహానాడు వేదికగా ఎన్టీఆర్కు భారతరత్న డిమాండ్ చేయడం చంద్రబాబుకు ఇదే మొదటిసారి కాదు. పబ్లిక్ రికార్డులను పరిశీలిస్తే.. గత కొన్ని సంవత్సరాలుగా దాదాపు ప్రతి మహానాడులోనూ ఈ అంశంపై తీర్మానాలు చేస్తూనే వస్తున్నారు. ముఖ్యంగా 2011, 2013, 2017, 2020, 2021, 2023 వంటి సంవత్సరాల్లో మహానాడు తీర్మానాల రూపంలో ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు. తాజాగా జరిగిన తీర్మానంతో కలిపి కనీసం 6 సార్లకు పైగా ఇదే డిమాండ్ను రికార్డుల కెక్కించారు.
ఎందుకు సాధించలేకపోయారు?
గతంలో 2014 నుంచి 2018 వరకు, అలాగే ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ(BJP) నేతృత్వంలోని ఎన్డీఏ (NDA) కూటమిలో చంద్రబాబు నాయుడు కీలక భాగస్వామిగా కొనసాగుతున్నారు. కేంద్ర ప్రభుత్వంలో చక్రం తిప్పగల స్థాయి ఉన్నప్పటికీ.. కేవలం మహానాడు వేదికలకే పరిమితమయ్యేలా ఈ “ఉత్తుత్తి తీర్మానాలు”(Symbolic Resolutions) చేయడం ఎందుకు? కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ఎన్టీఆర్కు భారతరత్న ఎందుకు సాధించలేకపోతున్నారనే ప్రశ్నలు రాజకీయ విశ్లేషకుల నుంచి వ్యక్తమవుతున్నాయి.
“అధికారంలో భాగస్వామిగా ఉండి కూడా అవార్డు సాధించలేకపోవడం, కేవలం ఎన్నికల లబ్ధి కోసమే ఎన్టీఆర్ పేరును వాడుకుంటున్నారనడానికి నిదర్శనం” అని విమర్శకులు మండిపడుతున్నారు.
దండ వేసి దండం పెడతారా? సీనియర్ల ఆగ్రహం
మహానాడు వేదికగా చంద్రబాబు ప్రవర్తిస్తున్న తీరుపై సీనియర్ రాజకీయ నేతలు తీవ్రంగా ధ్వజమెత్తుతున్నారు. నాడు ఎన్టీఆర్ను పదవీచ్యుతుడ్ని చేసి, మానసిక క్షోభకు గురిచేసి, ఆయన మరణానికి పరోక్షంగా కారణమైన వ్యక్తే.. ఇవాళ ఆయన ఫోటోకు దండ వేసి దండం పెట్టడం, భారతరత్న డిమాండ్ చేయడం అత్యంత హాస్యాస్పదంగా ఉందని విమర్శిస్తున్నారు.
‘వాడు, వీడు’ వీడియో వైరల్..
ఇదిలా ఉంటే, గతంలో ఒక ప్రముఖ టీడీపీ(TDP) అనుకూల టీవీ ఛానల్ (TV Channel) ఇంటర్వ్యూలో (Interview) చంద్రబాబు నాయుడు మాట్లాడిన పాత వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. సదరు టీవీ ఛానల్ ఎండీతో (MD) జరిగిన సంభాషణలో ఎన్టీఆర్ను ఉద్దేశించి చంద్రబాబు ‘వాడు, వీడు’ అంటూ ఏకవచనంతో దూషించిన వీడియో క్లిప్పింగులు ఇప్పుడు తెలుగు తమ్ముళ్లను సైతం విస్మయానికి గురిచేస్తోంది. లోలోపల ఎన్టీఆర్ను అంతగా దూషిస్తూ, బయటకు మాత్రం భారతరత్న అంటూ మాయమాటలు చెబుతున్నారని నిజమైన ఎన్టీఆర్ అభిమానులు, అనుచరులు సోషల్ మీడియా వేదికగా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
పిల్లనిచ్చిన మామ, @JaiTDP వ్యవస్థాపకుడు స్వర్గీయ NTR కు @ncbn ఇచ్చే గౌరవ మర్యాదలు ఇవే..
— Jagananna Connects (@JaganannaCNCTS) May 28, 2026
నిజమైన పసుపు సైనికులు, ఎన్టీఆర్ ఫాలోవర్స్ మరోసారి విని తరించాల్సిన వీడియో.. మీ కోసం.#YSRCP #JaganannaConnects pic.twitter.com/4hQBer1qtx








జనసేన నేత బూతు పురాణం.. ప్రెస్మీట్లోనే తిరగబడ్డ జర్నలిస్టులు (Video)