తన భార్య ధనుశ్రీ వర్మతో విడాకుల వార్తల తరువాత టీమ్ ఇండియా దిగ్గజ స్పిన్నర్ యజ్వేంద్ర చాహల్ గురించి ఓ ఆసక్తికరమైన రూమర్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఇటీవల ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్కు చాహల్ ఒక అమ్మాయితో కలిసి హాజరయ్యారు. ఆమె గురించి నెట్లో శోధించి, ఆర్జే మహ్వాష్గా గురించారు. ఆ తరువాత వీరిద్దరూ డేటింగ్లో ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
కాగా, ఈ సమయంలోనే ఆర్జే మహ్వాష్ చేసిన ఇన్స్టా పోస్ట్ వైరల్గా మారింది. “నేను ఈ స్థాయికి రావడం చూసి చిన్ననాటి మహ్వాష్ ఎంతో గర్విస్తోంది. నాకు కావాల్సింది కూడా ఇదే. మనం ఏ తప్పు చేయకుండా, అనవసర విషయాలు పట్టించుకోకుండా మన పని మనం చేసుకుంటూ ముందుకు సాగాలి” అని పేర్కొన్నారు. ఈ మాటలు డేటింగ్ రూమర్స్కు సమాధానంగా ఇచ్చిందని నెటిజన్లు భావిస్తున్నారు.