“న్యాయం ఆలస్యమైనా.. జ‌రిగిన అన్యాయానికి శిక్ష‌లు లేవా..?”

"న్యాయం ఆలస్యమైనా.. జ‌రిగిన అన్యాయానికి శిక్ష‌లు లేవా..?"

రాజ‌కీయ పార్టీలు (Political Parties) రాజ‌కీయ స్వార్థం కోసం మీడియా (Media) ను అడ్డుపెట్టుకొని ఒక అబ‌ద్ధాన్ని వండి దాన్నే నిజం చేయాల‌ని గంట‌ల కొద్దీ ప్ర‌సారాలతో ప్ర‌చారం హోరెత్తించారు. వారి దుష్ప్ర‌చారానికి (False Campaign) ఎవ‌రూ అతీతం కాదు. అటువైపు ఉన్న‌ది అమ్మాయి అయినా స‌రే. వాస్త‌వాలు ఏంట‌న్న అంశంపై కాస్త ప‌రిశీల‌న కూడా చేయ‌కుండా మీడియా ముసుగు వేసుకొని విష‌ప్ర‌చారానికి తెగ‌బ‌డ్డారు. నిజం బ‌య‌ట‌కు వ‌చ్చిన త‌రువాత కాస్త‌యినా ప‌శ్చాతాపం వ్య‌క్తం చేయ‌రు.. త‌ప్పు చేశామ‌ని ఒప్పుకోరు.. ఇందుకు ముంబై (Mumbai) లోని రియా చ‌క్ర‌వ‌ర్తి (Rhea Chakraborty) కేసు ఒక ఉదాహ‌ర‌ణ‌.

బాలీవుడ్ (Bollywood) నటి రియా చక్రవర్తి కంటే దురదృష్టవంతురాలు ఇంకెవరైనా ఉంటారా? ఆమెను “గోల్డ్ డిగ్గర్”(Gold Digger), “మర్డరర్”(Murderer) అంటూ టీవీ ఛానళ్లలో ప్ర‌చారాలు, సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేశారు. సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ (Sushant Singh Rajput) మృతికేసులో చివరికి ఆమె నెలరోజుల జైలు జీవితాన్ని అనుభ‌వించారు. 2020 జూన్ (June 2020) నుంచి వారం క్రితం వ‌ర‌కు మీడియా ఛాన‌ళ్లు, సోష‌ల్ మీడియాలో రియాపై విప‌రీత‌మైన దుష్ప్ర‌చారం జ‌రిగింది. ఎట్ట‌కేల‌కు ఈకేసులో నిజం బ‌య‌ట‌కు వ‌చ్చింది. సెంట్ర‌ల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేష‌న్ (CBI) తాజాగా కోర్టుకు ఇచ్చిన నివేదికలో, సుశాంత్ మరణానికి రియా లేదా ఆమె కుటుంబ సభ్యులకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. ఈ కేసును అన్ని కోణాల్లో పరిశీలించిన అనంతరం దర్యాప్తు (Investigation) ను ముగించామని పేర్కొంది.

యువతిని బలి చేసేలా హింసాత్మక ప్రచారం
సుశాంత్ మరణం తర్వాత రియాపై దేశవ్యాప్తంగా విషపూరిత ప్రచారం జరిగింది. “ఆమెకు బ్లాక్ మ్యాజిక్ తెలుసు, “సుశాంత్‌ను ఆత్మహత్యకు ప్రేరేపించిన మానిప్యులేటివ్ స్త్రీ” అంటూ కొన్ని మీడియా సంస్థలు ఆమెను నిందించి తీవ్ర మాన‌సిక వేధ‌న‌ (Mental Harassment) కు గురిచేశారు. ప్రముఖులుగా చెప్పుకునే టీవీ యాంకర్లు (TV Anchors) ఆమెను జైలుకు పంపించే వరకు నిరంత‌రాయంగా క్యాంపెయిన్ నడిపారు. కానీ, ఆల‌స్య‌మైనా చివ‌ర‌కు న్యాయం గెలిచింది. మీడియా సంస్థ‌లు TRP కోసం ఒక అమాయకురాలిని మానసికంగా వేధించారు.. రియాకు క్షమాపణ చెప్పండి అని డిమాండ్ మొద‌లైంది.

ఏపీలోనూ ఇంతే.. సీబీఐ క్లీన్‌చిట్‌
విశాఖ (Visakhapatnam) పోర్టుకు వ‌చ్చిన కంటైన‌ర్‌ (Container) లో డ్రగ్స్ అంటూ 2024 ఎన్నిక‌ల ముందు గంట‌ల కొద్దీ విష‌ప్ర‌చారం చేశారు. అనుభ‌వ‌జ్ఞుడైన రాజ‌కీయ నేత‌ క‌నుస‌న్న‌ల్లోని మీడియా ఛాన‌ళ్లు స్పెష‌ల్ ప్యాకేజీలు న‌డిపాయి. అబ‌ద్ధాన్ని వండి దాన్ని అప్ప‌టి సీఎం వైఎస్ జ‌గ‌న్‌ (YS Jagan) కు, వారి పార్టీ నేత‌ల‌కు ఆపాదించే ప్ర‌య‌త్నం చేశారు. బ్రెజిల్‌ నుంచి ఆ కంటైనర్‌లో తెచ్చిన 25,000 టన్నుల డ్రైడ్‌ ఈస్ట్‌లో డ్రగ్స్ ఉన్నాయని, వాటిని వైసీపీ (YCP) ప్ర‌భుత్వ‌మే తెప్పించిందనే లెవ‌ల్‌లో క్యాంపెయిన్ న‌డిపారు. కంటైనర్‌లో అలాంటివేమీ లేవని సీబీఐ తేల్చింది. వాటిలో డ్రగ్స్ అవశేషాలేమీ లేవని సీబీఐ క్లీన్‌చిట్ (Clean Chit) ఇచ్చింది. మ‌రి జ‌గ‌న్‌పై, ఆ పార్టీ నేత‌ల‌పై వేసిన నింద‌ల‌కు, జ‌నంలో వారిని ప‌లుచ‌న చేసే ప్ర‌య‌త్నం చేసినందుకు క్ష‌మాప‌ణ‌లు చెప్ప‌గ‌ల‌రా..? క్ష‌మాప‌ణ‌లు చెప్పి నిజ‌మైన రాజ‌నీతిజ్ఞులు అనిపించుకోగ‌ల‌రా..?

30,000 మంది మిస్సింగ్‌.. 1% అయినా వెన‌క్కి తెచ్చారా..?
ఎన్నిక‌ల ప్ర‌క్రియ (Election Process) మొద‌లై మ‌రికొన్ని రోజుల్లో పోలింగ్ జ‌ర‌గ‌నుంద‌న్న స‌మ‌యంలో రాష్ట్రంలో 30,000 మంది అమ్మాయిల మిస్సింగ్‌కు వాలంటీర్లే (Volunteers) కార‌ణ‌మ‌ని సినీ గ్లామ‌ర్ క‌లిగిన రాజ‌కీయ నేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ సంచ‌ల‌న ఆరోప‌ణ (Sensational Allegation) చేశారు. తన వ్యాఖ్య‌ల‌ను పొడిగిస్తూ కేంద్ర ప్ర‌భుత్వం వ‌ద్ద స‌మ‌గ్ర నివేదిక ఉంద‌ని రాష్ట్ర ప్ర‌జ‌ల‌ను న‌మ్మించే ప్ర‌య‌త్నం చేశారు. సంక్షేమ ప‌థ‌కాలు డోర్ డెలివ‌రీ చేసే వ్య‌వ‌స్థపై ప‌వ‌న్ వేసిన నింద‌తో వ‌లంటీర్లంతా తీవ్ర మాన‌సిక వేధ‌న‌కు గుర‌య్యారు. ఎన్నిక‌ల ప్ర‌తి స‌భ‌లోనూ 30,000 వేల మంది అమ్మాయిల మిస్సింగ్ అని ప‌దే ప‌దే వారిపై రాళ్లు వేయ‌డంతో వాలంటీర్ల‌ను మాన‌సిక క్షోభ‌ను అనుభ‌వించారు. టీడీపీ (TDP) , బీజేపీ (BJP), ప‌వ‌న్ పార్టీ క‌లిసి అధికారాన్ని ఏర్పాటు చేసి 10 నెల‌లు అయిపోయింది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాట‌ల ప్ర‌కారం 30,000 మందిలో 1% అంటే 300 మందిని కూడా వెన‌క్కి ర‌ప్పించ‌లేక‌పోయారు. అస‌లు ప‌వ‌న్ చేసిన ఆరోప‌ణ (Allegation) నిజ‌మేనా..? లేక ఎన్నిక‌ల (Elections) కోసం దుష్ప్ర‌చార‌మా..? మ‌రి దీనికి స‌మాధానం ఎవ‌రు చెబుతారు..? ఇదిలా మిగిలిపోవాల్సిందేనా..?

Join WhatsApp

Join Now

Leave a Comment