తెలంగాణ రాజకీయ వేదికలో మైనింగ్ కుంభకోణం ఇప్పుడు కేంద్ర బిందువుగా మారింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తాజాగా నిర్వహించిన ప్రెస్ మీట్లో ప్రభుత్వంపై ఘాటైన విమర్శలు గుప్పించారు. ఆయన హరీష్ రావు అసెంబ్లీలో బయటపెట్టిన ఆధారాలను గుర్తు చేస్తూ, ప్రభుత్వ నిర్లక్ష్యం, స్కామ్పై వెనకాడుతనం వంటి విషయాలను తీవ్రంగా అభ్యంతరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు ఇతర అధికార పార్టీ నేతలపై సంచలన ఆరోపణలు చేసారు. ముఖ్యంగా, మైనింగ్ కంపెనీలలో ముఖ్యమంత్రి భాగస్వామ్యం ఉందని, అందుకే హౌస్ కమిటీ ద్వారా విచారణకు ప్రభుత్వం కుడా ముందుకు రాలేదని ఆయన ఆరోపించారు.
కౌశిక్ రెడ్డి పై ఎథిక్స్ కమిటీ కేసు వేయడంపై కూడా ఆయన తీవ్రంగా స్పందించారు. తన వ్యక్తిగత పర్సనాలిటీపై చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ, స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్, 20 ఏళ్ల కష్టం మరియు ఫిట్నెస్ను ఉదహరిస్తూ, ఎథిక్స్ కమిటీ ముందు ధైర్యంగా అన్ని విషయాలను వెల్లడిస్తానని ప్రకటించారు. అలాగే కడియం శ్రీహరి వ్యవహారంపై విమర్శలు గుప్పిస్తూ, అసెంబ్లీలో పార్టీ స్పష్టత చూపకపోవడం పై ప్రశ్నించారు. హుజురాబాద్ డంపింగ్ యార్డ్ అడ్డుకోవడానికి చేపట్టిన తన యత్నం కోసం సిఐడి నోటీసులు వ్యక్తిగతంగా ఇచ్చినందుకు కౌశిక్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన స్పష్టంగా ప్రకటించారు – “విచారణకు వెళ్తాను, కానీ పోలీసు వెనుకాడుతుంటే డంపింగ్ యార్డ్ అడ్డుకుంటాను” అని.








