- సుబ్బయ్య అంత్యక్రియలు పూర్తి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వీర జవాన్ సుబ్బయ్య తన ప్రాణాలను పణంగా పెట్టి 30మంది సైనికుల ప్రాణాలను కాపాడి వీర మరణం పొందారు. సుబ్బయ్య అంత్యక్రియలు ఆయన స్వగ్రామం అనంతపురం జిల్లా నార్పలలో సైనిక లాంఛనాలతో ఘనంగా పూర్తయ్యాయి.
సైనిక గౌరవంతో వీడ్కోలు
సుబ్బయ్య భౌతికకాయానికి సైనికులు గౌరవ వందనం సమర్పించి, దేశ జెండాను ఆయన భార్యకు అందించారు. పోలీసులూ, ప్రజలూ, కుటుంబ సభ్యులూ అశ్రునయనాలతో ఆయనకు వీడ్కోలు పలికారు. “ఇక సెలవంటూ” సుబ్బయ్య భార్య, కొడుకు, కుమార్తె సెల్యూట్ చేసిన దృశ్యం ప్రతి ఒక్కరి హృదయాన్ని కదిలించింది. ఆ దృశ్యాలు కంట నీరు తెప్పిస్తున్నాయి.