టీటీడీ గోవుల మృతి.. కూట‌మికి బీజేపీ నేత షాక్‌

టీటీడీ గోవుల మృతి.. కూట‌మికి బీజేపీ నేత షాక్‌

తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం (Tirumala Tirupati Devasthanams – TTD) ఆధ్వ‌ర్యంలోని గోశాల్లో 100కు పైగా ఆవులు (Cows) మృతిచెందాయ‌న్న సంఘ‌ట‌నను ఇటీవ‌ల వైసీపీ (YSRCP) నేత‌, టీటీడీ మాజీ చైర్మ‌న్ భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి (Bhuma Karunakar Reddy) బ‌య‌ట‌పెట్టారు. ఆయ‌న విడుద‌ల చేసిన ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. కాగా, మూడు నెల‌ల్లో 100కు పైగా టీటీడీ గోవులు (TTD Cows) మృతిపై శ్రీ‌వారి భ‌క్తులు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. టీటీడీ పాల‌క‌మండ‌లి, కూట‌మి ప్ర‌భుత్వంపై భ‌క్తులు (Devotees) తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ సోష‌ల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.

గోవుల మృతి ఘ‌ట‌న‌ను టీటీడీ ఓ ట్వీట్ (Tweet) ద్వారా ఖండించింది. వాస్త‌వానికి కూట‌మి ప్ర‌భుత్వం ఏర్ప‌డిన త‌రువాత కొత్త‌గా కొలువైన టీటీడీ బోర్డు గోవుల సంర‌క్ష‌ణ‌కు ఎలాంటి చ‌ర్య‌లు తీసుకుందో స్ప‌ష్ట‌త ఇవ్వ‌లేక‌పోవ‌డం కూడా విమ‌ర్శ‌ల‌కు తావిస్తోంది. నెల‌కు 10 ఆవులు చ‌నిపోయాతాయ‌ని ఓ ప‌త్రిక చేసిన ప్ర‌క‌ట‌న భ‌క్తుల‌కు ఆగ్ర‌హం తెప్పిస్తోంది. 10 ఆవులుకు ఒక సంర‌క్ష‌కుడు ఉండాల్సింది.. ప్ర‌స్తుతం ఇద్ద‌రు ముగ్గురితో మాత్ర‌మే న‌డుపుతున్న‌ట్లుగా విశ్వ‌స‌నీయ స‌మాచారం. గోవుల‌కు అందించి గ్రాసం, వైద్యం, సంర‌క్ష‌ణ‌కు తీసుకుంటున్న చ‌ర్య‌ల‌పై స‌మ‌గ్ర విచార‌ణ జ‌ర‌గాల‌ని భ‌క్తులు డిమాండ్ చేస్తున్నారు.

బీజేపీ నేత సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌
టీటీడీ (TTD) గోశాల‌లో (Cow Shelters) గోవుల మృతిపై బీజేపీ (BJP) నేత సుబ్ర‌హ్మ‌ణ్య‌స్వామి (Subramanian Swamy) సీరియ‌స్ అయ్యారు. మూడు నెలల వ్యవధిలో పలు గోవులు చనిపోవడం (Cow Deaths) తీవ్రంగా కలిచివేసిందన్నారు. గోవుల మృతి విషయం టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన ద్వారా తెలిసిందని, దీనిపై మరింత సమాచారం సేకరిస్తున్నాన‌ని తెలిపారు. ఆర్టికల్ 48 ప్రకారం గో సంరక్షణ బాధ్య‌త ప్రభుత్వానిదేన‌ని, సమాచారం సేకరించి కోర్టులో పిల్ (PIL – Public Interest Litigation) వేస్తాన‌ని కూట‌మి ప్ర‌భుత్వానికి (Coalition Government) బీజేపీ సీనియ‌ర్ నేత షాకిచ్చారు.

Join WhatsApp

Join Now

Leave a Comment