త్వ‌ర‌లో వైసీపీలోకి కీల‌క నేత రీ-ఎంట్రీ

త్వ‌ర‌లో వైసీపీలోకి కీల‌క నేత రీ-ఎంట్రీ

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో త్వ‌ర‌లో ఆసక్తికర ప‌రిణామం చోటుచేసుకోనున్న‌ట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో ఘోర పరాజయం ఎదుర్కొన్న వైసీపీ, ఇప్పుడు క్రమంగా తమ శక్తిని పునరుద్ధరించుకునే ప‌నిలో ఉంది. 2024 ఎన్నికల్లో కేవలం 11 అసెంబ్లీ సీట్లు, 4 పార్లమెంట్ సీట్లకే పరిమితమైన వైసీపీ, పార్టీని సంస్థాగ‌తంగా నిర్మించుకోవ‌డం, నూతన శక్తిని సమకూర్చుకునే దిశగా అడుగులు వేస్తోంది.

ఇప్పుడీ తరుణంలో మాజీ ఎమ్మెల్యే, సీనియర్ నేత కాపు రామచంద్రారెడ్డి తిరిగి వైసీపీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నట్టు సమాచారం. అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గానికి పలుమార్లు ప్రాతినిధ్యం వహించిన ఆయన, 2019 ఎన్నికల్లో వైసీపీ తరఫున విజయం సాధించారు. అయితే, 2024 ఎన్నికల ముందు జగన్ టికెట్ ఇవ్వకపోవడంతో ఆయన బీజేపీలో చేరారు. ప్రస్తుతం బీజేపీలో పెద్దగా ప్రాధాన్యత లభించకపోవడంతో ఆయన మళ్లీ సొంత వైసీపీ గూటికి చేరాలని భావిస్తున్నారని తెలుస్తోంది.

జగన్ పర్యటనలో కీలక పరిణామం?
జగన్ త్వరలో జిల్లాల పర్యటనకు వెళ్లనున్న నేపథ్యంలో, ఆ పర్యటనలోనే ఆయన అధికారికంగా వైసీపీలో చేరే అవకాశాలు ఉన్నాయని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ఈ చేరిక ద్వారా వైసీపీకి కొంత మేర ఊరట కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment