బిహార్‌లో ఎన్నిక‌ల వ‌రాలు.. ఉచిత విద్యుత్‌ ప్రకటన

బిహార్‌లో ఎన్నిక‌ల వ‌రాలు.. ఉచిత విద్యుత్‌ ప్రకటన

బిహార్‌లో ఎన్నికల వేళ ఎన్డీఏ ప్రభుత్వం ప్రజలకు మరో కీలక వ‌రాన్ని ప్రకటించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ప్రతి కుటుంబానికి నెలకు 125 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించనున్నట్లు ప్రకటించారు. ఈ పథకం ఆగస్టు 1వ తేదీ నుంచి అమలులోకి రానుంది. బిహార్ రాష్ట్రంలోని 1.67 కోట్ల కుటుంబాలు ఈ ఉచిత విద్యుత్ పథకం ద్వారా లబ్ధి పొందనున్నాయని ప్ర‌క‌టించారు. రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో పేద, మధ్య తరగతి కుటుంబాలు ఉండటంతో ఈ నిర్ణయం వారికి విశేష ఉపశమనం కలిగించనుందని ప్రభుత్వం పేర్కొంది.

మహిళల రిజర్వేషన్ తర్వాత మరో బంపర్ ఆఫర్
ఇటీవల బిహార్ ప్రభుత్వం ఉద్యోగాల్లో మహిళలకు 35 శాతం రిజర్వేషన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఉచిత విద్యుత్ పథకంతో ఎన్డీఏ మరోసారి ఓ భారీ ప్యాకేజీ ప్రకటించింది. ఇది రాష్ట్ర ఎన్నికల ముందు బీజేపీ-జేడీయూ కూటమి చేపట్టిన కీలక హామీగా భావిస్తున్నారు.

రాజకీయ ప్రాధాన్యత
ఈ ప్రకటన ఎన్నికల నేపథ్యంలో ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతును బలపరిచేలా ఉంటుందన్నది విశ్లేషకుల అంచనా. ముఖ్యంగా గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో ఉన్న పేదవర్గాలను ఆకర్షించేందుకు ఉచిత విద్యుత్‌ పథకం కీలకంగా మారనుంది. ఇది నితీశ్ కుమార్‌కు ప్రజల్లో మరింత ప్రజాదరణ తీసుకురావచ్చని భావిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment