బంగ్లాదేశ్ క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ ఓపెనర్గా పేరు పొందిన తమీమ్ ఇక్బాల్, అంతర్జాతీయ క్రికెట్కు రెండోసారి రిటైర్మెంట్ ప్రకటించి క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేశాడు. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు, తమీమ్ ఇక్బాల్ను ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం జట్టులో భాగంగా ఉండాలని భావించినప్పటికీ, తమీమ్ తీసుకున్న నిర్ణయం వారిని షాక్కు గురిచేసింది.
“ఛాంపియన్స్ ట్రోఫీ మొదలవడానికి ఇంకా కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ టోర్నీ ముందు నాపై ఎటువంటి చర్చలు జరుగకూడదని, జట్టుపై ఒత్తిడి ఉండకూడదని ఈ నిర్ణయం తీసుకున్నాను” అని తమీమ్ స్పష్టం చేశారు. తమీమ్ ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నాడనే దానిపై మిశ్రమ స్పందనలు వినిపిస్తున్నాయి. అతని రిటైర్మెంట్ పట్ల అభిమానులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.