మరో హిందూ ఆలయంపై దాడి.. విగ్రహం ధ్వంసం

మరో హిందూ ఆలయంపై దాడి.. విగ్రహం ధ్వంసం

హిందూ ఆలయంపై దాడి తీవ్ర కలకలం రేపింది. బంగ్లాదేశ్‌లోని లక్ష్మీపూర్ జిల్లా, రాయ్‌పూర్ ప్రాంతం మురిహట్‌లో ఉన్న శ్రీశ్రీ మహామాయ దేవాలయంలో ముసుగులతో ధరించిన దుండగులు విగ్రహాన్ని ధ్వంసం చేశారు. హోలీ పండగ సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకోవడం అక్కడి హిందూ మైనారిటీ ప్రజల్లో భయాందోళనలకు గురిచేసింది.

CCTV ఫుటేజ్ లో దొరికిన ఆధారాలు
హోలీ పండగ రోజు పూజా కార్య‌క్ర‌మాలు ముగిసిన అనంతరం ఆలయ పూజారులు వెళ్లిపోయారు. ఆ తర్వాతే ఈ దాడి జరిగింది. శ‌నివారం తిరిగి ఆలయానికి వచ్చిన పూజారి, విగ్రహం ధ్వంసం అయిన దృశ్యం చూసి షాక్‌కు గురయ్యారు. వెంటనే ఈ విషయాన్ని స్థానిక హిందూ సంఘానికి తెలియజేశారు. ఆలయంలో ఏర్పాటు చేసిన CCTV కెమెరాల్లో ముసుగు ధరించిన వ్యక్తి ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించి, విగ్రహాన్ని ధ్వంసం చేసి పారిపోతున్న దృశ్యాలు రికార్డయ్యాయి.

నిందితుల అరెస్ట్ డిమాండ్
ఈ ఘటనపై ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి విశ్వనాథ్ సాహా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నిందితులను 24 గంటల్లోపే అరెస్ట్ చేయాలని లక్ష్మీపూర్ పూజ ఉత్సవ్ పరిషత్ డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలో రాయ్‌పూర్ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జి నిజాం ఉద్దీన్ భూయాన్ సంఘటనా స్థలాన్ని సందర్శించి, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment