పాక్ భూభాగంలో భారత జాతీయ గీతం

పాక్ భూభాగంలో భారత జాతీయ గీతం

పాకిస్థాన్‌ (Pakistan) లోని బలూచిస్తాన్ (Balochistan) ప్రాంతం భారత్‌ (India)పై తనకున్న అభిమానాన్ని మరోసారి వ్యక్తపరిచింది. పాకిస్తాన్‌కు వ్య‌తిరేకంగా పోరాటం చేస్తున్న బ‌లూచిస్తాన్‌.. పాక్ ఆర్మీ (Pakistan Army)పై దాడుల‌కు తెగ‌బ‌డుతోంది. పాక్‌తో యుద్ధం చేస్తున్న భార‌త్‌కు పూర్తి మ‌ద్ద‌తుగా నిలుస్తోంది. సోష‌ల్ మీడియాలో బ‌లూచిస్తాన్ వాసులు భార‌త జెండాల‌ను ప్ర‌ద‌ర్శించిన సంద‌ర్భాలు సైతం ఉన్నాయి.

కాగా, ఇటీవల ఇద్దరు బలూచీ చిన్నారులు (Balochi Children) భారత జాతీయ గీతం (Indian National Anthem) జనగణమన‌ (Jana Gana Mana) ను ఆలపించి అందరినీ ఆకట్టుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బాలురు ఈ గీతాన్ని పాకిస్తాన్‌ ఉగ్రవాద దాడికి గురైన పహల్గామ్ ఘటన బాధితులకు అంకితం చేశారు. ఇది పాకిస్థాన్‌లోని ప్రభుత్వ వైఖరికి విరుద్ధంగా, బలూచీ ప్రజల్లో భారత్‌పట్ల ఉన్న ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు.

బలూచిస్తాన్ ప్రజలు తమ స్వతంత్రం కోసం చాలా కాలంగా పోరాడుతూనే ఉన్నారు. ఈ సందర్భంలో జాతీయ గీతం ఆల‌పించిన చిన్నారులు భారత ప్రజల మనన్న‌లు పొందుతోంది. పాకిస్తాన్ భూభాగంలోని చిన్నారులు సైతం పాక్ వైఖ‌రిపై తీవ్ర వ్య‌తిరేకంగా ఉన్న‌ట్లుగా అర్థం అవుతోంది.

Join WhatsApp

Join Now

Leave a Comment