దేశ అత్యున్నత పౌర పురస్కారాలైన పద్మ అవార్డుల (Padma Awards) ప్రదానోత్సవం (Presentation Ceremony) సోమవారం రాష్ట్రపతి భవన్ (Rashtrapati Bhavan) లో ఘనంగా జరిగింది. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu) వివిధ రంగాల్లో విశేష సేవలందించిన ప్రముఖులకు అవార్డులు అందజేశారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం జనవరిలో 139 మందికి పద్మ అవార్డులను ప్రకటించింది. వీరిలో 7 మందికి పద్మవిభూషణ్, 19 మందికి పద్మభూషణ్, 113 మందికి పద్మశ్రీ అవార్డులు దక్కాయి.
తెలంగాణ నుంచి వైద్య రంగానికి చేసిన సేవల కోసం డాక్టర్ దువ్వూరి నాగేశ్వరరావుకు పద్మభూషణ్, ప్రజా ఉద్యమాల్లో విశేషంగా పనిచేసిన మంద కృష్ణ మాదిగకు పద్మశ్రీ అవార్డు లభించాయి. రాష్ట్రపతి చేతుల మీదుగా సోమవారం జరిగిన వేడుకలో దువ్వూరి నాగేశ్వరరావు తన పురస్కారాన్ని అందుకున్నారు.
ఇక, సినీ రంగంలోనూ పలువురు ప్రముఖులు అవార్డులు అందుకున్నారు. తెలుగు సినీ నటుడు నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna), తమిళ స్టార్ అజిత్ కుమార్ (Ajith Kumar), ప్రముఖ గాయకుడు అరిజిత్ సింగ్లు రాష్ట్రపతి నుంచి పద్మ భూషణ్ (Padma Bhushan) అవార్డులను స్వీకరించారు. కాగా, అవార్డుల ప్రదానోత్సవంలో బాలకృష్ణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పంచకట్టుతో సంప్రదాయ లుక్లో హాజరై అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా అవార్డు గ్రహీతలకు అభినందనలు వెల్లువెత్తాయి.