భారత్ ఘోర పరాజయం.. సిరీస్‌ ఆస్ట్రేలియా వ‌శం

భారత్ ఘోర పరాజయం.. సిరీస్‌ ఆస్ట్రేలియా వ‌శం

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని ఆస్ట్రేలియా కైవ‌సం చేసుకుంది. ఆఖ‌రి మ్యాచ్‌పై బోలెడ‌న్ని ఆశ‌లు పెట్టుకున్న టీమిండియా సిడ్నీ టెస్టులో ప‌రాజ‌యం పాలైంది. దీంతో 3-1 తేడాతో సిరీస్ ఆసిస్ వ‌శ‌మైంది. సిడ్నీ వేదిక‌గా ఆస్ట్రేలియాతో జ‌రిగిన ఐదో టెస్టులో 6 వికెట్ల తేడాతో టీమిండియా ఘోర పరాజయాన్ని చ‌విచూసింది. దీంతో ఐదు మ్యాచ్‌ల బోర్డ‌ర్‌-గ‌వాస్క‌ర్ ట్రోఫీని 3-1 తేడాతో భార‌త్ కోల్పోయింది. పదేళ్ల తర్వాత ఆస్ట్రేలియా బీజీటీ ట్రోఫీని తిరిగి సొంతం చేసుకుంది.

ఐదో టెస్టులో..
ఈ మ్యాచ్‌లో, భారత జట్టు మొదటి ఇన్సింగ్స్‌లో 185 పరుగులు చేసి, ఆసీస్‌ను 181 పరుగులకు ఆలౌట్ చేసింది. రెండో ఇన్సింగ్స్‌లో, భారత్ 157 పరుగులు చేయగా, ఆసీస్ 162 పరుగులతో రెండు వికెట్ల నష్టానికి విజయాన్ని అందుకుంది. ఈ విజయంతో ఆస్ట్రేలియా, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు తన స్థానం ఖరారు చేసుకుంది.

సెకండ్ ఇన్సింగ్స్‌లో టీమ్ ఇండియా తరఫున రిషబ్ పంత్ అత్యధికంగా 61 పరుగులు చేసి అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాడు. కాగా, యువ ఓపెనర్ యశస్వీ జైస్వాల్ 22 పరుగుల వద్ద ఔట్ అయ్యాడు. శుభ్‌మన్ గిల్ 13 పరుగులు, విరాట్ కోహ్లీ 6 పరుగులే సాధించారు. ఆస్ట్రేలియా బౌలర్లలో స్కాట్ బోలాండ్ 6 వికెట్లు పడగొట్టగా, పాట్ కమ్మిన్స్ 3 వికెట్లు తీశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment