టాలీవుడ్ (Tollywood) నటుడు కల్యాణ్ రామ్ (Kalyan Ram), లేడీ సూపర్ స్టార్ విజయశాంతి (Vijayashanti) ప్రధాన పాత్రల్లో నటించిన ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ (‘Arjun S/o Vyjayanthi’) మూవీ ఓటీటీ (OTT) లోకి వచ్చేసింది. యాక్షన్, ఎమోషన్ కలగలిసిన ఈ డ్రామా చిత్రం ఏప్రిల్ 18న థియేటర్లలో విడుదలై మిక్స్డ్ రెస్పాన్స్ను సాధించుకుంది. ప్రదీప్ చిలుకూరి (Pradeep Chilukuri) దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా, మే 12 అర్ధరాత్రి నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లో స్ట్రీమింగ్కు అందుబాటులోకి వచ్చింది. అయితే, ప్రస్తుతం ఈ చిత్రం కేవలం యునైటెడ్ కింగ్డమ్ (యూకే) ప్రాంతానికి మాత్రమే పరిమితం అయ్యింది. ఈ సినిమాను ఓటీటీలో రెంటెడ్ విధానంలో చూడాల్సి వస్తుందంటున్నారు ఆడియెన్స్.
ఇండియా (India)లో ఈ సినిమా ఎప్పుడు స్ట్రీమింగ్కు అందుబాటులోకి వస్తుందన్నది అభిమానుల్లో ఆసక్తి కలిగిస్తోంది. తాజా సమాచారం ప్రకారం, వచ్చే గురువారం లేదా శుక్రవారం నాటికి ఇక్కడ కూడా ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.
ఈ చిత్రంలో కల్యాణ్ రామ్, విజయశాంతితో పాటు బాలీవుడ్ నటులు అర్జున్ రాంపాల్, సోహైల్ ఖాన్ కీలక పాత్రలు పోషించారు. బబ్లూ పృథ్వీరాజ్, చరణ్ రాజ్, శ్రీరామ్ తదితరులు ఇతర పాత్రల్లో కనిపించగా, సాయి మంజ్రేకర్ కథానాయికగా నటించింది. అజనీష్ లోక్నాథ్ మ్యూజిక్ అందించగా, టెక్నికల్ టీమ్ కూడా బలంగా ఉన్న ఈ చిత్రం ఓటీటీలో ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.