న్యూ ఇయర్ సంబరాలు స్టార్ట్ అవుతున్న సమయంలో ఆంధ్రప్రదేశ్-తెలంగాణ సరిహద్దు వద్ద డ్రగ్స్ కలకలం సృష్టించాయి. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం నల్లబండగూడెం వద్ద ఆర్టీసీ బస్సులో డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్న ఎక్సైజ్ పోలీసులు, నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. భువనేశ్వర్ నుండి హైదరాబాద్కు ప్రయాణించే బస్సులో ఎక్సైజ్ పోలీసులు తనిఖీలు చేపట్టగా, డ్రగ్స్ పట్టుబడ్డాయి. వెంటనే బస్సును తనిఖీ చేసి ఈ పెద్ద డ్రగ్స్ రవాణాను అడ్డుకున్నారు. పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు.
డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనలో సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఇక, గంజాయి, డ్రగ్స్ వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వం గట్టిగా చర్యలు తీసుకుంటోంది. ముఖ్యంగా గంజాయి సాగు, సరఫరా, విక్రయాలు వంటి వాటిపై కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణను డ్రగ్స్ ఫ్రీ రాష్ట్రంగా మార్చాలని నిర్ణయించారు. ఈ ఆదేశాలను పోలీసులు కఠినంగా అమలు చేస్తున్నారు.