తాజాగా విడుదలైన ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) టెన్త్ ఫలితాలు (10th Results) రెండు కుటుంబాల్లో విషాదాన్ని నింపాయి. ఇవాళ ఉదయం 10 గంటలకు ఏపీ ఎస్ఎస్సీ రిజల్ట్ రిలీజ్ చేశారు. పదో తరగతి వార్షిక పరీక్షల్లో తక్కువ మార్కులు వచ్చాయని మానసిక ఆందోళనకు గురైన ఇద్దరు విద్యార్థులు (Students) తీసుకున్న తీవ్ర నిర్ణయం వారి కుటుంబాల్లో తీరని శోకాన్ని నింపాయి.
కృష్ణా జిల్లా (Krishna District) అర్జువానిగూడెంకు చెందిన అనిల్ (Anil) టెన్త్ పరీక్షల్లో సైన్స్ సబ్జెక్టులో ఫెయిలయ్యాడు (Fail). ఈ విషయాన్ని తట్టుకోలేక మనోవేదనకు (Mental Agony) లోనై ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అదే విధంగా శ్రీకాకుళం జిల్లా బలగ ప్రాంతానికి చెందిన వేణుగోపాలరావు (Venugopala Rao) టెన్త్ ఫలితాల్లో 393 మార్కులు సాధించాడు. తాను ఆశించిన స్థాయిలో మార్కులు రాకపోవడంతో తీవ్ర నిరాశకు గురై అతను కూడా ఉరేసుకుని మృతిచెందాడు. ఒకరు ఒక సబ్జెక్ట్లో ఫెయిల్ అయ్యి, మరొకరు తక్కువ మార్కులు రావడంతో మనస్తాపం చెంది బలవన్మరణం చెందారు. పది పరీక్షల మార్కులు రెండు కుటుంబాల్లో విషాదాన్ని నింపాయి.