కొత్త హెలికాప్టర్ కొనుగోలు.. ప్ర‌భుత్వంపై విమర్శలు

కొత్త హెలికాప్టర్ కొనుగోలు.. ప్ర‌భుత్వంపై విమర్శలు

రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితి అంతంత మాత్రంగానే ఉన్న స‌మ‌యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త హెలికాప్టర్ కొనుగోలుకు రంగం సిద్ధం చేసింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం, సీఎం మరియు ఇతర మంత్రుల సౌకర్యార్థం ఈ హెలికాప్టర్‌ను ఉపయోగించాలని యోచిస్తోంది. ఈ ప్రక్రియలో భాగంగా, హెలికాప్టర్ మోడల్ ఎంపిక, ధర వివరాలను నిర్ధారించడానికి ఒక ప్రత్యేక కమిటీని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

కమిటీ సిఫారసుల ఆధారంగా, ఏ మోడల్ కొనుగోలు చేయాలి, దాని ధర ఎంత ఉండాలి వంటి వివరాలను తుది నిర్ణయం కోసం సీఎం చంద్రబాబు నాయుడుకు సమర్పించనుంది. కమిటీ నివేదిక అందిన తర్వాత, హెలికాప్టర్ కొనుగోలు ప్రక్రియను ప్రభుత్వం పూర్తి చేయనుంది.

కొత్త హెలికాప్ట‌ర్‌ నిర్ణయం బయటకు రావడంతో ప్ర‌తిప‌క్ష‌ వైసీపీ నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. రాష్ట్రానికి ఆదాయం లేని పరిస్థితుల్లో హెలికాప్టర్ కొనుగోలు అవసరమా..? అని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ప‌థ‌కాల అమ‌లుపై చిత్త‌శుద్ధి లేకుండా.. విలాస‌వంత‌మైన ప్ర‌యాణాల కోసం ప్ర‌భుత్వ ఖ‌జానాపై భారం మోప‌డం ఏంట‌నే ప్ర‌శ్న‌లు త‌లెత్తుతున్నాయి. ఈ నిర్ణయం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చర్చను రేకెత్తించే అవకాశం ఉంది. హెలికాప్ట‌ర్‌ కొనుగోలు ఖర్చు మరియు దాని మెయింటెనెన్స్ వంటి అంశాల‌పై ప్రజల నుంచి కూడా మిశ్రమ స్పందనలు వస్తున్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment