ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సతీమణి (Pawan Kalyan Wife) అన్నా లెజినోవా (Anna Lezhinova) తిరుమల (Tirumala) శ్రీవారిని (Lord Venkateswara) దర్శించుకున్నారు. తెల్లవారుజామున జరిగిన శ్రీవారి సుప్రభాత సేవలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీటీడీ అధికారులు (TTD Officials) అన్నా లెజినోవాకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్ద ఘనస్వాగతం పలికారు. అనంతరం స్వామివారి దర్శనం (Lord’s Darshan) అనంతరం తీర్థప్రసాదాలు అందజేశారు. గత రాత్రే తిరుమల చేరుకున్న అన్నా లెజినోవా, వేంకటేశ్వరస్వామికి తలనీలాలు (Hair Offering) సమర్పించి తన మొక్కును తీర్చుకున్నారు.
అన్నా లెజినోవా కుమారుడు ఇటీవల సింగపూర్లోని ఓ స్కూల్లో జరిగిన అగ్నిప్రమాదంలో గాయపడిన విషయం తెలిసిందే. ఆస్పత్రిలో చికిత్స అనంతరం ఏపీకి తిరిగి వచ్చారు. కుమారుడు కోలుకోవడంతో పవన్ సతీమణి అననా లెజినోవా తిరుమల శ్రీవారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు.