నిప్పులాంటి నిజం ఒకటి బయటపడింది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సెకీతో గత వైసీపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఎన్నికల అనంతరం అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఈ ఒప్పందంపై అనేక ఆరోపణలు చేసింది. కూటమి ప్రభుత్వ చేసిన ప్రచారమంతా అవాస్తవమని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి కొట్టిపారేసింది. సెకీతో ఒప్పందం అంతా సక్రమమేని ఏపీఈఆర్సీ తేల్చి చెప్పింది. రాష్ట్రానికి వచ్చే 25 ఏళ్లలో రూ.1.10 లక్షల కోట్లు ఆదా చేసేలా నాటి వైఎస్ జగన్ సర్కార్ సెకీతో చేసుకున్న ఒప్పందం చేసుకుందని, దీని ఎలాంటి లోపాలూ లేవని, రాష్ట్ర చరిత్రలోనే ఇదొక కారుచౌక ఒప్పందమని ఏపీఈఆర్సీ తేల్చిచెప్పింది.
సీఎం చంద్రబాబు నాయుడు చేసిన ఆరోపణలకు ఆయన ప్రభుత్వ ఆధీనంలోనే ఉన్న ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి సెకీ ఒప్పందం సక్రమమే అని తేల్చడంతో కూటమి సర్కార్పై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. చంద్రబాబు, ఆయన పార్టీ నేతలు, అనుకూల పత్రికలు, టీవీ ఛానళ్లు వైఎస్ జగన్ ప్రభుత్వంపై నింద వేసినప్పటికీ, అది ఎంతో కాలం నిలవలేదు. సత్యం ఛేదించుకుంటూ వస్తుందని తేలిపోయింది. వైసీపీ ప్రతిష్టను దెబ్బతీయాలని, జగన్ వ్యక్తిత్వాన్ని దిగజార్చాలని కూటమి పార్టీలు చేసిన ప్రయత్నం ఏపీఈఆర్సీ స్టేట్మెంట్తో బెడిసికొట్టినట్లు అయ్యింది.
ఆ ఒప్పందం అంతా సక్రమమే
సెకీతో ఒప్పందం సక్రమమేనని, ఎలాంటి లోపాలు లేవని, అంతా నిబంధనల మేరకే జరిగిందని, రద్దు చేయడం కుదరదని, అంతర్ రాష్ట్ర ఛార్జీలు వర్తించవని ఏపీఈఆర్సీ స్పష్టం చేసింది. చంద్రబాబునాయుడు, టీడీపీ అనుకూల మీడియా, ఆయన మద్దతు దారులు జగన్పై ఆరోపణలు చేశారు. అమెరికాలో అదానీ డబ్బుకు జగన్కు లింక్ పెడుతూ వార్త కథనాలను సైతం అచ్చేశారు. కానీ అవన్నీ అవాస్తవాలని, కల్పిత రాతలని తేలిపోయింది. జగన్ ప్రెస్మీట్ పెట్టి తప్పుడు రాతలు రాసిన వారిపై 100 కోట్లకు పరువునష్టం దావా వేస్తున్నట్లుగా ప్రకటించారు.
జగన్కు క్షమాపణలు చెప్పాలని వైసీపీ డిమాండ్
ఈ ఒప్పదంలో థర్డ్ పార్టీ లేదు, దళారీలు లేరు అయినా, అవాస్తవాలను ప్రచారం చేశారు. యూనిట్ ధరకు కేవలం రూ.2.49కే ఒప్పందం చేసుకుంది. సెకీతో ఒప్పందం కారణంగా ఏటా ప్రభుత్వానికి రూ.4,400 కోట్లు, అలా 25 ఏళ్లలో దాదాపు రూ.1.10 లక్షల కోట్లు ఆదా అవుతుంది. వాస్తవాలు ఇలా ఉంటే.. చంద్రబాబు ప్రభుత్వం పనిగట్టుకొని జగన్పై విషప్రచారానికి పాల్పడిందని వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జగన్పై తపపుడు ప్రచారం చేసిన చంద్రబాబుతో సహా పవన్, బాలినేని శ్రీనివాసురెడ్డి, టీడీపీ అనుకూల మీడియా క్షమాపణలు చెప్పి, లెంపలేసుకోవాలని వైసీపీ డిమాండ్ చేస్తోంది.
బాబు హయాంలో పీపీఏలు..
వైసీపీ హయాంలో సెకీ నుంచి రూ.2.49కి కొనుగోలు చేస్తే.. చంద్రబాబు హయాంలో సౌర విద్యుత్పై చేసుకున్న ఒప్పందాలు చూస్తే కళ్లు చదురుతున్నాయి. పవన విద్యుత్ 2014–19 మధ్య 3,494 మెగావాట్లకు సంబంధించి 133 పీపీఏలు చేసుకున్నారు. రేటు రూ.4.84 నుంచి రూ.4.83వరకు కనిపిస్తుంది. సోలార్కు సంబంధించి.. 2,500 మెగావాట్లకు ఆయన పీపీఏలు చేసుకున్నారు. 2014లో 650 మెగావాట్లు సగటున రూ 6.49కి కొనుగోలుకు చంద్రబాబు ఒప్పందం చేసుకున్నారు. 2015లో రూ.5.96కు మరో 250 మెగావాట్లకు ఒప్పందం, 2016లో రూ.6.80, రూ.5.99, రూ.4.61, రూ.4.50కి కొనుగోలు చేశారు. సోలార్ ఎనర్జీని యావరేజ్గా రూ.5.90కి కొనుగోలు చేశారు. 2019–20లో ఏపీఈఆర్సీ విడదుల చేసిన టారిఫ్ ఆర్డర్ చూస్తే.. చంద్రబాబు హయాంలో విండ్ పవర్ యావరేజ్ యూనిట్ ప్రైస్ రూ.4.63 అయితే.. సోలార్ యూనిట్ రూ.5.90కి కొనుగోలు చేశారు. మరి జగన్ హయాంలో కేవలం రూ.2.49కే యూనిట్ను కొనుగోలు చేశారు.