అనకాపల్లిలో బాణసంచా కేంద్రంలో పేలుడు.. నలుగురు మృతి

ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh) లోని అనకాపల్లి జిల్లా (Anakapalli District)లో ఘోర అగ్ని ప్రమాదం (Fire Accident) చోటుచేసుకుంది. కోటవురట్ల (Kotovurthla) ప్రాంతంలోని ఒక బాణసంచా తయారీ కేంద్రంలో (Fireworks Manufacturing Unit) ఒక్కసారిగా భారీ పేలుడు (Massive Explosion) సంభవించింది. ఈ పేలుడుతో మంటలు విపరీతంగా ఎగిసిపడ్డాయి. ఘటనకు సంబంధించి ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం నలుగురు వ్యక్తులు (Four People) అక్కడికక్కడే మృతి (Died) చెందారు. ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు.

గాయపడినవారిని వెంటనే సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకొని మంటలను అదుపు చేయడానికి యత్నిస్తున్నారు. ప్రమాదానికి గల అసలు కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. అధికారులు పూర్తి సమాచారం కోసం దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment