- మృతిచెందిన చిన్నారుల తల్లి కీలక స్టేట్మెంట్
సంగారెడ్డి జిల్లా (Sangareddy District) అమీన్పూర్ (Ameenpur) లో ముగ్గురు చిన్నారుల మరణం (Death) స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మృతిచెందిన చిన్నారుల తల్లి రజిత (Rajitha) ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. విచారణలో భాగంగా రజిత పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలం (Statement) కీలకంగా మారింది. కేసులో బయటపడిన కొత్త కోణంపై పోలీసుల విచారణ కొనసాగుతోంది.
రజిత పోలీసులకు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం..
“గురువారం (Thursday) రాత్రి షాప్ నుంచి పెరుగు (Curd) తెచ్చుకున్నాం.. పిల్లలు, నేను నలుగురం కలిసి తిన్నాం. పెరుగు తిన్న తరువాత నా గొంతులో ఏదో పట్టుకున్నట్టు అనిపించింది. కిందపడిపోయాం. ఏం జరిగిందో తెలియదు. నా పిల్లలకు ఏమైనా అయిందా?” అని ఆమె ఆందోళన వ్యక్తం చేసింది. అయితే, తాను ఎలాంటి విషపదార్థాలు పిల్లలకు ఇవ్వలేదని రజిత స్పష్టంగా చెప్పింది. పోలీసులు ఇంట్లో డస్ట్ బిన్ను పరిశీలించి, అక్కడి నుంచి హెరిటేజ్ పెరుగు (Heritage Curd) ప్యాకెట్ను స్వాధీనం చేసుకున్నారు.
తండ్రి చెన్నయ్య విచారణలో..
పోలీసులు రజిత భర్త చెన్నయ్య (Chennayya) ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. స్థానికుల సమాచారం మేరకు రజిత, చెన్నయ్య దంపతులకీ ఎలాంటి విభేదాలు లేవని తెలుస్తోంది. రజిత చెన్నయ్యకు రెండో భార్య (Second Wife) అని పోలీసులు ధృవీకరించారు. మృతిచెందిన ముగ్గురు పిల్లలు రజిత-చెన్నయ్య దంపతుల సంతానమే అని, భార్యాభర్తల మధ్య ఎలాంటి విభేదాలు, తగాదాలు లేవని స్థానికులు చెప్తున్నారు. రజిత చాలా మంచిదని, పిల్లలను కూడా ప్రేమగా చూసుకుంటుందని స్థానికులు వివరించారు.
పోస్టుమార్టం రిపోర్టే కీలకం
ఈ ఘటనపై సంగారెడ్డి జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ (Paritosh Pankaj) మాట్లాడుతూ.. పోస్టుమార్టం రిపోర్టు వచ్చిన తర్వాతే అసలు విషయం బయటకు వస్తుందన్నారు. ఈ కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నామని చెప్పారు. మృతిచెందిన చిన్నారులను *ఇంతలోనే మార్చురీకి తరలించనున్నట్లు తెలిపారు. పోస్టుమార్టం (Postmortem) రిపోర్టే ఈ కేసులో కీలకంగా మారనుంది. చిన్నారుల మృతికి అసలు కారణం ఇదే రిపోర్ట్ ద్వారా తెలియనుంది.