చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) సర్కార్ అమరావతి (Amaravati) ని అభివృద్ధి చేయడానికి మరోసారి భారీ భూ సమీకరణ (Land Pooling) కు సిద్దమైంది. ఈసారి 44,676 ఎకరాల భూమి సీఆర్డీఏ (CRDA) ద్వారా సమీకరించేందుకు కసరత్తు చేస్తోంది. ఈ భూములు మూడు పంటలు పండే భూములు కావడంతో, రాష్ట్రానికి పెద్ద ఆదాయ వనరులుగా మారనున్నాయి. ఇప్పటికే 54 వేల ఎకరాలు సమీకరించిన ప్రభుత్వం అందులో ఇప్పటివరకు ఒక శాశ్వత భవనం (Permanent Building) కూడా నిర్మించకపోవడం గమనార్హం.
ప్రధాన ప్రాంతాల్లో సేకరణ
ఈ సారి 11 గ్రామాల్లో 44,676 ఎకరాలు భూములను సమీకరించనున్న ప్రభుత్వం. ఈ భూములు తుళ్లూరు, అమరావతి, తాడికొండ, మంగళగిరి ప్రాంతాల్లో ఉన్నాయి. గతంలో కొంతమంది రైతులు ప్రభుత్వానికి స్వచ్ఛందంగా భూమి అప్పగించినప్పటికీ.. పలువురు రైతులు (Farmers) మాత్రం ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టిన విషయం తెలిసింది. అమరావతి భూ సమీకరణ ప్రణాళికల్లో ఇన్సైడర్ ట్రేడింగ్ (Insider Trading) కు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. రాజధాని ప్రాంతం వస్తుందని తెలిసి ప్రభుత్వ పెద్దలు రైతుల నుండి తక్కువ ధరలకే భూములు కొనుగోలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. మరోసారి అమరావతి కోసం భూసమీకరణకు చంద్రబాబు ప్రభుత్వం కసరత్తు చేస్తుండటంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
ఒక్క శాశ్వత భవనం లేదూ..
అమరావతిలో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్, స్పోర్ట్స్ సిటీ, స్మార్ట్ ఇండస్ట్రీయల్ సిటీ నిర్మాణం, గ్రాండ్ ఎంట్రన్స్ మార్గాలు, ఇన్నర్ రింగ్ రోడ్డు, అవుటర్ రింగ్ రోడ్డు, అమరావతి రైల్వేలైన్, అంతర్జాతీయ స్టేడియం వంటి నిర్మాణాల కోసం భూములు సేకరించాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. కాగా, 2014 నుంచి 2019 వరకు అధికారంలో ఉన్న చంద్రబాబు ప్రభుత్వం అమరావతి ప్రాంతంలో ఒక్క శాశ్వత భవనం కూడా నిర్మించలేకపోయిందని, కేవలం గ్రాఫిక్ డిజైన్స్ ఫైనలైజేషన్ (Graphic Design Finalization), ఇతర దేశాల్లోని నిర్మాణ సంస్థలతో ఒప్పందాల కుదుర్చుకోవడంపైనే దృష్టిపెట్టిందన్న విమర్శలున్నాయి.
అమరావతిపై మళ్లీ ఫోకస్
ఏమాత్రం ఇన్ఫ్రాస్ట్రక్చర్ (Infrastructure) లేని అమరావతి నిర్మాణానికి ప్రభుత్వం లక్షల కోట్ల రూపాయల నిధులు ఖర్చు చేస్తోంది. గత వైసీపీ ప్రభుత్వం (YSRCP Government) రాష్ట్రంలోని ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ సిటీ (Established City)గా వైజాగ్ (Visakhapatnam) ను పరిపాలన రాజధాని (Administrative Capital) చేయాలని ప్రయత్నించింది. విశాఖకు కొంత ఊతం ఇస్తే ఇతర రాష్ట్రాల క్యాపిటల్ సిటీస్తో పోటీపడుతుందని అప్పటి ప్రభుత్వం భావించింది. ప్రభుత్వం మారిపోవడంతో మళ్లీ అమరావతి (Amaravati)పై ఫోకస్ పెరిగిందని, ప్రభుత్వం సేకరిస్తున్న నిధులన్నీ ఆ ప్రాంతాన్ని అభివృద్ధికి కేటాయిస్తోంది. ఇటీవల చంద్రబాబు సైతం 5 ఎకరాల స్థలంలో సొంత ఇంటి నిర్మాణానికి భూమి పూజ చేశారు. కాగా, అమరావతి కోసం గతంలో 54 వేల ఎకరాలను సేకరించిన టీడీపీ ప్రభుత్వం (TDP Government).. మరోసారి 44 వేల ఎకరాలకుపైగా భూములను సమీకరించేందుకు ప్రయత్నం మొదలుపెట్టింది.