ఇటీవల కాలంలో రైలు ప్రమాదాలతో ప్రయాణికులు భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా ఒడిశాలో చోటుచేసుకున్న గూడ్స్ రైలు ప్రమాదం మరోసారి రైల్వే భద్రతపై ప్రశ్నలు లేవనెత్తింది. రాయ్పూర్ వైపు వెళ్తున్న గూడ్స్ రైలు మూడు బోగీలు టిట్లాగఢ్ రైల్వే స్టేషన్ సమీపంలో నిన్న రాత్రి 8:30 గంటల సమయంలో పట్టాలు తప్పాయి.
ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడం ఊరట కలిగించింది. అయితే, బోగీలకు పూర్తిగా దెబ్బతిన్నాయని అధికారులు తెలిపారు. ప్రమాద సమాచారం అందుకున్న తూర్పు కోస్తా రైల్వే అధికారులు వెంటనే స్పందించి సంబల్పూర్ DRM తో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలను పరిశీలించారు. దెబ్బతిన్న బోగీలను ట్రాక్ నుంచి తొలగించి పునరుద్ధరణ చర్యలు చేపట్టారు.
వైరల్గా మారిన వీడియో
ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. ప్రయాణికుల భద్రతకు మరింత చర్యలు తీసుకోవాలని రైల్వే ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.