కర్ణాటక రాష్ట్రంలోని బీజాపూర్లో గల అల్-అమీన్ మెడికల్ కాలేజీలో చదువుతున్న కాశ్మీర్కు చెందిన రెండో సంవత్సరం ఎంబీబీఎస్ విద్యార్థిపై సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్ చేయడంతో పాటు దాడికి పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనపై జమ్మూ కాశ్మీర్ స్టూడెంట్స్ అసోసియేషన్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య జోక్యం చేసుకోవాలని కోరింది.
దాడి వెనుక ఏముంది?
మంగళవారం సాయంత్రం 4 గంటలకు హమీమ్ అనే విద్యార్థి 2019-2022 బ్యాచ్ల మధ్య జరుగుతున్న క్రికెట్ మ్యాచ్ను చూడటానికి వెళ్ళినప్పుడు ఈ సంఘటన జరిగినట్లు తెలుస్తోంది. జమ్మూ కాశ్మీర్ స్టూడెంట్స్ అసోసియేషన్ జాతీయ కన్వీనర్ నాసిర్ ఖుయేహామి ప్రకారం, ఒక సీనియర్ హమీమ్ను ఆ ప్రాంతాన్ని వదిలి వెళ్లాలని ఆదేశించాడని, అతను నిరాకరించడంతో దాడి జరిగినట్లు తెలిపారు.
గత సంవత్సరం కూడా డైనింగ్ హాల్లో ఓ సీనియర్ విద్యార్థి హమీమ్తో గొడవకు దిగినట్లు తెలుస్తోంది. సీనియర్లు అతడిని అవమానిస్తూ, ‘అల్-అమీన్ సెల్యూట్’ చేయమని, పాటలు పాడమని, డ్యాన్స్ చేయమంటూ బెదిరించారని సమాచారం. అతడు ఒప్పుకోకపోవడంతో సుమారు 8 మంది సీనియర్లు హమీమ్ గదిలోకి చొరబడి దాడి చేసినట్లు చెబుతున్నారు.
సీఎం స్పందన
ఈ ఘటనపై జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. “ఈ దురదృష్టకర సంఘటనపై నేను కర్ణాటక సీఎం సిద్ధరామయ్యతో మాట్లాడాను. పోలీసులు ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ర్యాగింగ్కు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన నాకు హామీ ఇచ్చారు. ఇప్పటి వరకు నలుగురు నిందితులను గుర్తించారు” అని తెలిపారు.








సీటు త్యాగం చేసిన వర్మకు సొంత పార్టీలోనే ‘షాక్’