వారం రోజుల మిషన్ కోసం వెళ్లి ఎనిమిది నెలల పాటు అంతరిక్షంలోనే ఉండిపోయిన భారత సంతతికి చెందిన నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్ త్వరలో భూమి మీదకు రానున్నారు. ఆమెతో పాటు అక్కడే ఉన్న బుచ్ విల్మోర్ కూడా తిరుగు ప్రయాణం కానున్నారు. ఇటీవల వీరిద్దరూ స్పేస్ స్టేషన్ నుంచి సీఎన్ఎన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు.
మార్చి 12న స్పేస్ఎక్స్ క్రూ-10 ద్వారా కొత్త వ్యోమగాములు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకుంటారు. వారి బాధ్యతలు స్వీకరించిన తర్వాత, మార్చి 19న సునీతా, విల్మోర్ భూమి తిరిగి చేరుకునే అవకాశం ఉంది.
జూన్ 6, 2023న సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ కలిసి బోయింగ్ స్టార్లైనర్ క్యాప్సుల్ లో అంతరిక్ష కేంద్రానికి చేరుకున్నారు. అసలు జూన్ 14న తిరిగి రావాల్సి ఉన్నా, వ్యోమనౌకలో హీలియం లీకేజీ కారణంగా సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దీంతో వారిద్దరూ ఎనిమిది నెలలుగా ISSలోనే ఉండిపోయారు. ఎట్టకేలకు వారి తిరుగు ప్రయాణానికి తుది తేదీ దగ్గరపడినట్లు తెలుస్తోంది.