సోనూసూద్ ‘సూద్ చారిటీ ఫౌండేషన్’కు కేంద్ర ప్రభుత్వం ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ (FCRA) లైసెన్సును మంజూరు చేసింది. ఈ లైసెన్స్తో, ఫౌండేషన్ ఇప్పుడు విదేశీ నిధులను స్వీకరించి, ఆ నిధులను సామాజిక సేవా కార్యక్రమాలకు వినియోగించుకునే వీలుంది.
సోనూసూద్ ఫౌండేషన్ ప్రకటించిన వివరాల ప్రకారం, ఈ నిధులను ఉపయోగించి అన్ని వర్గాల ప్రజలకు అత్యాధునిక వనరులు, సాయం అందించడమే వారి ప్రధాన లక్ష్యం. కొవిడ్ మహమ్మారి సమయంలో సోనూసూద్ చేసిన సేవలు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందాయి. ఆ సమయంలో నిరాశ్రయులు, కూలీలు, విద్యార్థులకు అనేక రకాల సహాయం అందించారు. ఈ FCRA లైసెన్స్ ద్వారా, ఇప్పుడు మరింత భారీ స్థాయిలో సేవా కార్యక్రమాలు చేపట్టేందుకు అవకాశం ఉంటుంది. భారతదేశం అంతటా అవసరమైన వారికి సహాయం చేయడానికి NGO పనిచేస్తుంది.
టిబెటన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెర్ఫార్మింగ్ యాక్ట్, ఠాకూర్ శ్రీ బాంకీ బీహార్ జీ మహారాజ్ మరియు హిస్ హోలీనెస్ దలైలామా ఛారిటబుల్ ట్రస్ట్ FCRA క్లియరెన్స్ పొందాయి. వాటి సరసన సోనూసూద్కు చెందిన సూద్ చారిటీ ఫౌండేషన్ కూడా చేరింది.