కోలీవుడ్ స్టార్ హీరో సూర్య తన 45వ చిత్రంలో విభిన్న పాత్రల్లో కనిపించబోతున్నారనే వార్తలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ఆర్జే బాలాజీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘పెట్టెక్కరన్’ అనే టైటిల్ను ఫిక్స్ చేసినట్లు సమాచారం. సూర్య ఈ సినిమాలో హీరోగానే కాకుండా, విలన్గా కూడా నటించనున్నారని తెలిసింది. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే, దీనిపై మేకర్స్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ఈ క్రేజీ అప్డేట్తో పాటు, సూర్య ద్విపాత్రల గురించి మరింత వివరాలు త్వరలో తెలియనుండగా, అభిమానులు సినిమాపై భారీగా అంచనాలు పెంచుకుంటున్నారు. ఈ సినిమాలో త్రిష కీ రోల్లో నటిస్తున్నారని తెలుస్తోంది.








