తెలంగాణ (Telangana) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Chief Minister Revanth Reddy) ప్రభుత్వంపై బీజేపీ ఎంపీ(BJP MP) ధర్మపురి అర్వింద్ (Dharmapuri Arvind) తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన మేనిఫెస్టో హామీలను (Manifesto Promises) కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) పూర్తిగా మర్చిపోయిందని ఆయన ఆరోపించారు.
ప్రస్తుతం ఎన్నికలు నిర్వహిస్తే కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం చవిచూస్తుందని, ప్రజల్లో ఆ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ప్రభుత్వ భూముల (Government Lands) విక్రయాల ద్వారా వచ్చిన వేల కోట్ల రూపాయలు ఎక్కడికి వెళ్తున్నాయో ప్రజలకు స్పష్టత ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి(State Financial Condition), ప్రభుత్వ విధానాలపై కూడా అర్వింద్ ప్రశ్నలు లేవనెత్తారు. భూములు విక్రయించడం ద్వారా వచ్చిన నిధుల వినియోగంపై ప్రభుత్వం శ్వేతపత్రం (White Paper) విడుదల చేయాలని కోరారు. అలాగే, పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై దృష్టి పెట్టాలని సూచిస్తూ, “పూరీలు (Pooris) చేయడం కాదు.. పాలన (Governance) ఎలా చేయాలో నేర్చుకోవాలి” అంటూ రేవంత్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. అర్వింద్ చేసిన ఈ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.








