ఛేజింగ్ అంటే విరాట్ కోహ్లీ.. విరాట్ కోహ్లీ అంటే విజయం! ఐపీఎల్ 2026లో మరోసారి ఇదే నిజమైంది. రాయ్పూర్ వేదికగా కోల్కతా నైట్ రైడర్స్పై 193 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయంలో ‘కింగ్’ కోహ్లీ అజేయ సెంచరీతో చరిత్ర సృష్టించాడు. కేవలం 60 బంతుల్లో 105 పరుగులతో చెలరేగిన కోహ్లీ.. 11 ఫోర్లు, 3 భారీ సిక్సర్లతో కేకేఆర్ బౌలర్లను చిత్తు చేశాడు. ఈ విజయంతో ఐపీఎల్ చరిత్రలో ఆర్సీబీ అత్యధిక విజయవంతమైన ఛేజింగ్ల జాబితాలో మరో మ్యాచ్ చేరగా.. ఆ జాబితాలో దాదాపు ప్రతి మ్యాచ్లో కోహ్లీ ప్రభావం ఉండటం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. “కోహ్లీ పరుగులు చేస్తే ఆర్సీబీ ఓడదు” అంటూ అభిమానులు పోస్టులతో హల్చల్ చేస్తున్నారు.
గణాంకాలు కూడా అదే చెబుతున్నాయి. 228 పరుగుల లక్ష్యాన్ని లక్నోపై ఛేజ్ చేసిన మ్యాచ్ నుంచి.. గుజరాత్, హైదరాబాద్, కేకేఆర్లపై నమోదైన భారీ విజయాల వరకు ప్రతి కీలక ఛేజ్లో కోహ్లీ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఒత్తిడి సమయంలో క్రీజులో నిలబడి మ్యాచ్ను ఫినిష్ చేయడం కోహ్లీ ప్రత్యేకతగా మారింది. ఈ సెంచరీతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న కోహ్లీ.. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుల రికార్డును కూడా సమం చేశాడు. ఒకవైపు ఆర్సీబీ ప్లేఆఫ్స్ రేసులో దూసుకెళ్తుండగా.. మరోవైపు కోహ్లీ తన బ్యాట్తో కొత్త రికార్డులను వేటాడుతున్నాడు. ప్రస్తుతం ఐపీఎల్లో “ఛేజింగ్ కింగ్” అంటే అభిమానుల మనసులో ఒక్క పేరు మాత్రమే మార్మోగుతోంది.. అదే విరాట్ కోహ్లీ!








వైసీపీలోకి రేపల్లె కీలక నేత.. జగన్ సంచలన హామీ